Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సరళీకృత ఆర్థిక విధానాలతో భారత్లో పెరిగిన అసమానతలు
న్యూఢిల్లీ :సరళీకృత ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చిన నాటితో పోల్చితే, నేడు మనదేశంలో 'అత్యంత పేదల' సంఖ్య పెరిగిందని తాజాగా ఒక అధ్యయనం తేల్చింది. సరళీకృత ఆర్థిక విధానాలు రాకముందు(1991కి ముందు) ఉన్న పేదరికం, వచ్చిన తర్వాత పేదరికం ఎలా మారిందన్నది ఈ అధ్యయనంలో విశ్లేషించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో పేదరికం తగ్గినా, ప్రజల్లో అత్యంత ఆర్థిక అసమానతలు అనూహ్యంగా పెరిగాయి. మనదేశంలో ఇది మరింత ఎక్కువగా నమోదైంది. ఇండియా మొత్తం జనాభాల్లో అత్యంత పేదలు 21.2శాతమున్నారని గణాంకాలు చెబుతున్నాయి. మూడో ప్రపంచదేశాలుగా గుర్తింపు పొందిన బ్రెజిల్, చైనా, ఇండోనేషియాలు మంచి ఫలితాలు సాధించాయి. చైనా మొత్తం జనాభాలో అత్యంత పేదలు కేవలం 0.7శాతంగా ఉందని లెక్కతేలింది. అలాగే...బ్రెజిల్లో 4.8శాతంగా, శ్రీలంకలో 0.8శాతంగా, ఇండోనేషియాలో 5.7శాతంగా నమోదైంది.