Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడా కార్పొరేట్ల లాభాల క్షీణతపై మోడీ సర్కార్ ఆందోళన
- సంపద సృష్టికర్తలను అనుమానించొద్దంటూ ఆవేదన
- రైతులు, కార్మికులు, పేదలు, మధ్యతరగతి గురించి పట్టించుకోని తీరు
- నిరుద్యోగిత 7.5 శాతానికి చేరిందంటున్న సీఎంఐఈ సర్వే
బడా పారిశ్రామికవేత్తల బడా కష్టాల గురించి ఆందోళన చెందుతున్న ప్రధాని మోడీ దేశ పౌరుల ఆకలి తీర్చే అన్నదాతల బాధల గురించీ, ఏ సంపద సృష్టి గురించి ఎర్రకోట నుంచి మాట్లాడారో అందుకోసం తమ స్వేదాన్నీ, రక్తాన్నీ ధారపోస్తున్న కార్మిక వర్గం కష్టాల గురించీ ఎందుకు మౌనం వహించారు..? తమ ప్రభుత్వ ఆర్థిక విధానాల రూపకల్పనకు ముందు ఆ వర్గాల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపేందుకు ఎందుకు వెనకాడారు..? సంపద సృష్టి జరగకుండా పంపిణీ ఎలా చేస్తాం..? అంటూ అదే ప్రసంగంలో ప్రధాని నోటి నుంచి జారిన మరో మాట. నిజమే.. సంపద సృష్టి జరగకుండా పంపిణీ జరపలేం. కానీ, గత యూపీఏ ప్రభుత్వంకన్నా తన హయాంలోనే సంపద కోకొల్లలుగా పెరిగిందని చెప్పుకుంటున్న మోడీ దానిని ఎవరికి పంపిణీ చేశారో చెప్పాలి..?
నవతెలంగాణ, జనరల్డెస్క్
భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో సాగుతుందన్న ఆర్థికవేత్తల విశ్లేషణల మధ్య మోడీ సర్కార్ దిద్దుబాటు చర్యలకు కసరత్తు ప్రారంభించినట్టు అర్థమవుతోంది. అందులో భాగంగానే ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ బ్యాంకర్లు, పారిశ్రామికవేత్తలు, మూలధన పెట్టుబడిదారులు, స్థిరాస్థి వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తూ బిజీ అయ్యారని భావిస్తున్నారు. అదే సమయంలో విదేశీ పెట్టుబడిదారులు తమ ఆదాయాలపై సర్ఛార్జీ విధించడం పట్ల ఆర్థికమంత్రి ముందు ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడిదారుల విన్నపాల మేరకు పన్నుల విధానంలో సానుకూల మార్పులకు మోడీ సర్కార్ యోచిస్తున్నట్టు ఊహాగానాలున్నాయి. అదే నిజమనిపించేలా స్వాతంత్య్ర దినోత్సవంనాడు ప్రధాని మోడీ ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ.. సంపద సృష్టించిడం ద్వారా దేశానికి సేవ చేస్తున్నారని, వారిని అనుమానించొద్దు, గౌరవించాలి, ప్రోత్సహించాలంటూ పరోక్షంగా కార్పొరేట్ల పట్ల సానుకూలత వ్యక్తం చేశారు.
మోడీ సర్కార్లోని విధాన నిర్ణేతలు కనీసం చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రతినిధులతోనూ సంప్రదించక పోవడం గమనార్హం. రైతులు,కార్మికులు, చిరు ఉద్యోగులు, పేదలు, మధ్యతరగతి వర్గీయుల గురించి పట్టించుకు న్నట్టుగా లేదు. మోడీ చెబుతున్న సంపద సృష్టికర్తలు బడా కార్పొరేట్ అధినేతలన్నది ఎంతవరకు వాస్తవం.? జీవశాస్త్ర భాషలో చెప్పాలంటే వాళ్లు పరాన్నజీవులు. ఇతరుల శ్రమను దోపీడీ చేయడం ద్వారా సంపన్నులైనవాళ్లు..
ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్య స్థూలంగా చూస్తే ఆర్థిక మాంద్యం. లోతుల్లోకి వెళ్లి చూస్తే లక్షలా దిమంది ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి. మోడీ సర్కార్ మాత్రం ఈ సమస్యను బడా కార్పొరేట్ల దృష్టి కోణం నుంచే చూస్తోంది. పేదలు, మధ్యతరగతి గురించి మాత్రం పట్టించుకున్నట్టు కనిపించదు. ఈ తరుణంలో నూతన ఉద్యోగాల సృష్టి జరగకపోగా, ఉన్న ఉద్యోగాలు ఊడిపో తున్న దుస్థితి. భారత ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణా కేంద్రం (సీఎంఐఈ) ఈ ఏడాది జులైలో నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలో నిరుద్యోగిత 7.5 శాతానికి చేరింది. రెండేండ్ల క్రితం(2017,ఆగస్టులో) ఇది 4.1 శాతం. ఆ తర్వాత దేశంలో నిరుద్యోగిత వరుసగా పెరుగుతూ వచ్చింది. 2018 ఆగస్టులో 6.3 శాతానికి, ఈ ఏడాది ఫిబ్రవరిలో 7.2 శాతానికి నిరుద్యోగిత పెరిగింది. ఆర్థిక మాంద్యం ఇలాగే కొనసాగితే నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చనున్నట్టు ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాని మోడీ 2016, నవంబర్ 8న తీసుకున్న ఆకస్మి క నిర్ణయం నోట్లరద్దు, ఆ తర్వాత ఏడాది జులై 1నుంచి హడావుడిగా అమలులోకి తెచ్చిన జీఎస్టీ వల్ల చిన్న పరిశ్రమ లు చితికిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు సేవలు, పర్యాటకం, ఐటీ, రవాణా, రియల్ ఎస్టేట్ రంగాల్లోనూ క్షీణత కనిపిస్తోంది. రానున్న ఆర్థిక మాంద్యానికీ, మరింత పెరగనున్న నిరుద్యోగితకూ ఇవి సంకేతాలుగా భావిస్తున్నారు. వాహనరంగం, రియల్ ఎస్టేట్ డీలా పడటం శాంపిల్ టెస్ట్గా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
వాహనరంగం గత 20 ఏండ్లలో మునుపెన్నడూ లేనంత సంక్షోభంలోకి కూరుకుపోయింది. అన్ని రకాల వాహనాల అమ్మకాలు బాగా తగ్గాయి. దేశంలోని ఆటోమొబైల్ పరిశ్రమలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 కోట్ల 50 లక్షలమంది పని చేస్తున్నట్టు అంచనా. గత ఆరు నెలల్లో ఈ రంగంలో మూడున్నర లక్షల ఉద్యోగాలు పోయినట్టు చెబుతున్నారు. ఇటీవల 300 డీలర్షిప్లు మూతపడ్డట్టు భారత వాహనదారుల సంఘం(సియామ్) తెలిపింది. ఈ రంగంలో 10 లక్షల ఉద్యోగాలపై ప్రభావం పడనున్నట్టు సియామ్ తెలిపింది. ఇటీవల వాహనాల అమ్మకాలు బాగా పడిపోవడానికి కారణం ప్రజల ఆదాయాలు తగ్గిపోవడం తోపాటు బీఎస్-6. వచ్చే ఏడాది నుంచి బీఎస్-6 కాలుష్య ప్రమాణాలు అమల్లోకి రాబోతున్నట్టు ప్రభుత్వం చెబుతోం ది. దీనిపై స్పష్టత ఇవ్వాలని వాహనాల తయారీదారులు ప్రభుత్వాన్ని కోరారు. కనీసం 15 ఏండ్లపాటు తమ వాహనాలకు విధానాల పరంగా ఇబ్బంది ఉండబోదన్న భరోసా వినియోగదారులకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. 2030 వరకల్లా అన్ని రకాల వాహనాల్లో విద్యుత్ వాహనాల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం చెబుతోంది.
స్థిరాస్థి రంగం, నిర్మాణరంగం విడదీయలేనివి. ఈ రంగాలకు అనుబంధంగా దాదాపు 250 రకాల పరిశ్రమ లు(ఇటుకల తయారీ,సిమెంట్,స్టీల్, ఫర్నీచర్,విద్యుత్ పరిక రాలు, రంగుల పరిశ్రమ, వగైరా) ఆధారపడి ఉన్నాయి. దేశ శ్రామికశక్తిలో ఈ రంగాల వాటా 12 శాతం. వ్యవసాయ రంగంలో తగిన ఉపాధి లభించని చిన్న రైతులు, కూలీలు ఈ రంగంలో పని చేయడం జరుగుతోంది. కాగా, దేశం లోని ప్రధాన నగరాల్లో ఏడాది కాలంగా ఇండ్ల అమ్మకాలు బాగా తగ్గాయి.
ఈ రంగంలోని రీసెర్చ్ సంస్థ లయసెస్ ఫోరాస్ ప్రకారం 42 నెలలుగా అమ్మకాలు లేక పెట్టుబ డులు వెనక్కిరాని స్థితి. దీంతో, ఈ రంగంలో ఉపాధి పొందుతున్న లక్షలాదిమంది తిరిగి రోడ్లమీదికొచ్చే పరిస్థితి.