Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర సమాచార మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో: భారత సాహిత్యరంగంలో రచయితలతో పాటు రచయిత్రుల కృషి కూడా అభినందనీయమని కేంద్ర సమాచార మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ పేర్కొన్నారు. ముఖ్యంగా తెలుగు భాషలో మహిళల కృషి అధికమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల ప్రముఖ స్త్రీవాద రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి మరణం ప్రస్తుత సమాజానికి తీరని లోటని అన్నారు. మహిళల సమస్యలు, హక్కులపై ఆమె ఎంతగానో కృషి చేశారని వివరించారు. పురుషాధిపత్యంపై ఇతర మహిళా రచయితలు ఎంతగానో తమ రచనల ద్వారా పోరాటం చేస్తున్నారని శ్రీధర్ గుర్తు చేశారు. ఆదివారం ఢిల్లీలోని ఆంధ్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ''హస్తినా రచయిత్రుల సాహిత్య సమ్మేళనం'' కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ.. పురాణాల నుంచి సాహితీరంగంలో మహిళలు సేవలు అందించారని చెప్పారు. వేద విద్యాభ్యాసం చేసిన గార్గి, మైత్రేయి సకల సిద్ధాంతాలను తెలియజెప్పిన ప్రవక్తలని కొనియాడారు. అయితే, ఇలాంటి ఆదర్శమూర్తులు జన్మించిన నేలపై మహిళలు విద్యనభ్యసించకూడదన్న దశకం కూడా కొనసాగిందని వివరించారు. అయినా, మహిళా రచయితలు... హేతవాదుల కారణంగా క్రమంగా పురుషాధిపత్యంపై పోరాడుతూ వస్తున్నారని తెలిపారు. వేద సాహిత్య రంగాభివద్ధికి మహిళా సాహితీవేత్తలు చేసిన కషి ఎప్పటికీ మరువలేనిదన్నారు. ఆధునిక కాలంలోనూ మహిళలు పెద్ద ఎత్తున సాహితీ రంగానికి సేవలు అందిస్తున్నారని చెప్పారు. ఇదే స్పూర్తితో రానున్న రోజుల్లోనూ మహిళలు సాహితీరంగానికి మరింత అత్యుత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య ఏల్చూరి మురళీధర్ రావు, ఎం.వి.లక్ష్మీ, ఎస్ఎస్.లక్ష్మీ, ఆంధ్రా అసోసియేషన్ ఢిల్లీ అధ్యక్షులు ఆర్.మణినాయుడు, డి.సుబ్రమణ్యం, తదితరులు పాల్గొన్నారు.