Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వాధికారులను ఉద్దేశించి నితిన్ గడ్కరీ వివాదస్పద వ్యాఖ్యలు
ముంబయి: బాధ్యత గల పదవిలో ఉన్న కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రభుత్వాదికారులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'ప్రభు త్వాధికారు లు సరిగ్గా పనిచేయకపోతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వారిని కొట్టండి' అంటూ విరుచుకు పడ్డారు. నాగ్పూర్లో జరిగిన 'లఘు ఉద్యోగ భారతి' కార్యక్రమంలో పై విధంగా వ్యాఖ్యానించారు. పలువురు పారిశ్రామికవేత్తలు హాజరైన ఈ కార్యక్రమం లో గడ్కరీ మాట్లాడుతూ.. 'అధికారులు ప్రభుత్వ సేవకులు మాత్రమే. కానీ నన్ను ప్రజలు ఎన్నుకున్నారు. నేను ప్రజలకు సమాధానం చెప్పాలి. అవినీతికి పాల్పడే అధికారులను దొంగలుగా పరిచయం చేస్తాను. అనుకున్న సమయానికి పనులు పూర్తవపోతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని, అధికారులపై దాడి చేయండని సూచిస్తాను. ఒక వ్యవస్థలో న్యాయం జరగలేదంటే, ఆ వ్యవస్థను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నా ఉపాధ్యాయులు నాకు ఇదే నేర్పారు' అని అన్నారు. ఇంతలా విరుచుకుపడ్డ గడ్కరీ.. అసలు ఏ సమస్యపై మాట్లాడారో, ఏ శాఖ అధికారులనుద్దేశించి మాట్లాడారో చెప్పకపోవడం గమనార్హం. అధికారంలో ఉన్న నాయకులను జనం నీలదీయకుండా ప్రభత్వ అధికారులపై ఎగదోసే ప్రయత్నమని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.