Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ ఎంపీ హన్స్ రాజ్ హన్స్ వివాదాస్పద డిమాండ్
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ హన్స్రాజ్ హన్స్ వివాదాస్పద డిమాండ్ను ముందుకు తీసుకువచ్చారు. ప్రఖ్యాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేెఎన్యూ) పేరు మార్చాలన్నారు. ప్రధాని మోడీ పేరు మీద జేఎన్యూని మోడీ నరేంద్ర యూనివర్సిటీ(ఎంఎన్యూ)గా మార్చాలని ఆయన సూచిం చారు. జేఎన్యూలో శనివారం జరిగిన సైనిక అమరవీరుల స్మారక కార్యక్రమంలో ఆయన పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టికల్ 370 రద్దుపై మాట్లాడారు. జమ్మూకాశ్మీర్లో శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా ఉండాలని కోరుకుంటు న్నట్టు తెలిపారు. గత పాలకులు చేసిన తప్పిదాల వల్లే కాశ్మీర్ సమస్య ఏర్పడిందనీ, నేటీకీ అక్కడి ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేకహోదా కల్పించే ఆరిక్టల్370ని రద్దు చేయడం, ఈ రాష్రా ్టన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం వంటి ఆంశా లపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు. కాగా 1969లో ఏర్పాటైన జేఎన్యూకు.. ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రు పేరు పెట్టారనీ, యూనివర్సిటీ పేరు మార్చాలని ఆయన డిమాండ్ చేశారు .