Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాట్నా : బీహార్ మాజీ సీఎం జగన్నాధ్ మిశ్రా సోమవారం కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. మిశ్రా బీహార్కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్రంలో పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. ఆయన సోదరుడు లలిత్ నారాయణ్ మిశ్రా ఇంధిరాగాంధీ హాయంలో రైల్వే శాఖ మంత్రిగా చేశారు. రాజకీయాల్లోని రాకుముందు జగన్నాధ్ మిశ్రా బీహార్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తించారు. ఆర్థిక రంగానికి సంబంధించి ఆయన పలు పుస్తకాలు కూడా రచించారు. ప్రస్తుతం ఆయన కుమారుడు నితీష్ మిశ్రా నితీష్కుమార్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు.