Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎంపీలకు సర్కారు ఆదేశం
న్యూఢిల్లీ : 16వ లోక్సభ రద్దైన నేపథ్యంలో మాజీ ఎంపీలు తమకు కేటాయించిన భవనాలను వెంటనే ఖాళీ చేయాలని సర్కారు ఆదేశించింది. ఇందుకు గానూ ఏడు రోజుల సమయాన్ని ఇస్తూ వారికి ఆదేశాలు జారీ చేసింది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో కొత్తగా ఎంపికై ఢిల్లీకి వస్తున్న ఎంపీలకు వసతి సదుపాయం అందుబాటులో లేదని ప్రధాని మోడీ ఇటీవలే ట్వీట్ చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే పార్లమెంటు హౌజింగ్ కమిటీ చైర్మన్ సీఆర్ పాటిల్ సుమారు 200 ఎంపీలకు లేఖలు రాశారు. వారం రోజుల్లోగా వారంతా తమ భవనాలను ఖాళీ చేయాలని కోరారు. ఈ ఏడు రోజల్లో చివరి మూడు రోజల్లో వారికి విద్యుత్, నీటి వసతి కట్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.