Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్నాతకోత్సవానికి దూరంగా లా టాపర్
- గొగోరుపై లైంగికదాడి ఆరోపణల కేసులో దర్యాప్తు తీరుకు నిరసనగానే..
న్యూఢిల్లీ : దేశరాజధానిలోని నేషనల్ లా యూనివర్సిటీ (ఎన్ఎల్యూ) స్నాతకోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) రంజన్గొగోరుకు చేదు అనుభవం ఎదురైంది. గొగోరు చేతుల మీదుగా అవార్డు స్వీకరించడానికి ఇష్టంలేని లా టాపర్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. గొగోరుపై లైంగికదాడి ఆరోపణల కేసును సుప్రీంకోర్టు చేపట్టడం..ఈ కేసులో దర్యాప్తు తీరుకు నిరసనగానే టాపర్ ఈ వేడుకకు హాజరు కాలేదని వెల్లడించింది. ఈ నెల 17న ఎన్ఎల్యూ ఏడో స్నాతకోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీజేఐతో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ,ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాతో పాటు పలువురు పాల్గొన్నారు. అయితే ఇందులో భాగంగా వర్సిటీ టాపర్గా నిలిచిన సురభి కర్వాకు గోల్డ్ మెడల్ ప్రదానం చేయడానికి ఆమె పేరును వర్సిటీ రిజిస్ట్రార్ జిఎస్ బాజ్పేయి పిలిచారు. అయితే ఆమె మాత్రం ఆ సమయంలో అక్కడ లేదు. టాపర్గా నిలిచిన తాను.. గోల్డ్ మెడల్ను స్వీకరించబోతున్న విషయం సురభికి అంతకముందే తెలుసు. కానీ, గోల్డ్ మెడల్ను గొగోరు చేతుల మీదుగా అందుకోవడం ఇష్టం లేని సురభి కార్యక్రమానికి దూరంగా ఉండిపోయింది. అయితే సీజేఐపై ఒక మహిళా ఉద్యోగి లైంగికదాడి ఆరోపణలు చేసిన విషయంలో కేసును సుప్రీంకోర్టు చేపట్టడంపై దర్యాప్తు తీరుకు నిరసనగానే గొగోరు చేతుల మీదుగా అవార్డును అందుకోలేదని సురభి తెలిపింది. స్నాతకోత్సవానికి హాజరు కాలేదంటే అవార్డును తిరస్కరిస్తున్నట్టు కాదని సురభి స్పష్టం చేసింది.