Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనారోగ్యంతో ముంబయిలో కన్నుమూత
ముంబయి: ప్రముఖ సంగీత దర్శకుడు మహ్మద్ జహూర్ ఖయ్యాం (92) సోమవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఖయ్యాం ముంబయిలో ని సుజరు ఆస్పత్రిలో కొన్ని రోజుల క్రితం చేరారు. చికిత్స పొందుతున్న సమయం లోనే ఆయనకు గుండెపోటు రావడంతో చనిపోయారు. కభీ కభీ(1972), నూరీ(1979), ఉమ్రావో జాన్(1981), రజియా సుల్తాన్(1983), బజార్ (1982) వంటి పలు బాలీవుడ్ చిత్రాలకు ఖయ్యాం సంగీతం అందించారు. ఖయ్యాం 2007లో సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నారు. ఉమ్రావో జాన్ చిత్రానికి ఆయన నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకున్నారు. సంగీతంలో ఆయన చేసిన సేవలకుగానూ భారత ప్రభుత్వం 2011లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. మంగళవారం మధ్యాహ్నం ఖయ్యాం అంత్యక్రియలు జరగనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.