Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొన్నది తక్కువ - ఖర్చు ఎక్కువ
- ట్రూ అప్లో గత ప్రభుత్వ నిర్వాకం
- ఆ ప్రతిపాదనలనే ఈఆర్సీకిచ్చిన జగన్ సర్కారు
అమరావతి : పదహేను వేల కోట్ల రూపాయలు...! విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సమర్పించిన ట్రూ అప్ ఛార్జీల మొత్తం ఇది! తెలుగు దేశం ప్రభుత్వ హయంలో చోటుచేసుకున్న ఈ భారీ లోటు మొత్తంలో వాస్తవం కన్నా అంకెల మాయాజాలమే ఎక్కువే! 2015-16 నుండి నాలుగేండ్లకు సంబంధించిన ఈ మొత్తంలో ఈఆర్సీ అనుమతించినదానికన్నా తక్కువ విద్యుత్నే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీనికోసం చెల్లించిన ఫిక్స్డ్ ఛార్జీలు కూడా తక్కువే! కానీ, ఇతర ఖర్చులు అనూహ్యంగా పెరిగిపోయాయి.
ఆ ఖర్చులేమిటి? ఎందుకు పెరిగాయి? బాధ్యత ఎవరిది? ఈ ప్రశ్నలను గత టిడిపి సర్కారు పట్టించుకోలేదు. అన్నింటినీ సమీక్షిస్తా మంటున్న జగన్ ప్రభుత్వానికీ ఈ ప్రశ్నలు పట్టలేదు. యధాతధంగా ఇఆర్సికి సమర్పించింది. ఇఆర్సి ఎంత అనుమతిస్తే ఆ భారం విద్యుత్ వినియోగదారులపై పడనుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఈఆర్సీకి తాజాగా సమర్పించిన ట్రూ అప్ లెక్కలపై నిపుణుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. గడిచిన కాలానికి సంబంధించి అంచనాలకు, వాస్తవ ఖర్చుకు మధ్య చోటుచేసుకున్న తేడాను ఈఆర్సీ అనుమతితో విద్యుత్ సంస్థలు వినియోగదారుల నుండి వసూలు చేస్తాయి. ఆ ప్రక్రియలో భాగంగా ఈ ఏడాది సమర్పించిన 15వేల కోట్ల రూపాయల హేతుబద్దతపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఏ ఏడాదికి ఆ ఏడాది ఖర్చుల వివరాలు ఇవ్వకుండా, ఒకేసారి నాలుగు సంవత్సరాలకు ప్రతిపాదించడంతో పాటు, ఆ ఖర్చులకు సంబంధించిన కారణాలను కూడా అధికార యంత్రాంగం వివరంగా చెప్పకపోవడం దీనికి కారణం. ఈ నేపథ్యంలోనే ట్రూఅప్ చార్జీల ప్రతిపాదనను తిరస్కరించాలన్న డిమాండ్ వారి నుండి వస్తోంది.
రెండేళ్లలోనే 11వేల కోట్లు
తాజాగా ఈఆర్సీకి సమర్పించిన ప్రతిపాదనల్లో 2015-16, 16-17 సంవత్సరాలకే 11 వేల కోట్ల రూపాయలను విద్యుత్ కొనుగోళ్ల నష్టంగా చూపిం చారు. అయితే, ఇంత భారీ మొత్తానికి సంబంధించిన వివరాలు సమగ్రంగా సమర్పించకపోవడం గమ నార్హం. డీనిని ప్రాధమిక స్థాయిలోనే తిరస్కరించి ఉండాల్సిందన్న అభిప్రాయం నిపుణుల్లో వ్యక్తమవు తోంది. ఇక 2016-17లో 56,805 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలుకు కమిషన్ అనుమతి ఇస్తే డిస్కాంలు 52,561 మిలియన్ యూనిట్లనే కొనుగోలు చేశాయి. అంటే 4,244 మిలియన్ యూనిట్లు తక్కువ! ఆ ప్రాతిపదికగా అయితే ఖర్చు తగ్గి ఉండాలి. కానీ, జరిగింది వేరు. ఈఆర్సీ 22,538 కోట్ల రూపాయలకు అనుమతి ఇస్తే 25,455 కోట్ల రూపాయలను చెల్లించారు. ఇది రూ.2,917 కోట్లు ఎక్కువ! దీనికి సంబంధించి సమర్పించిన వివరాల్లో విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన ఫిక్స్డ్ చార్జీలు 270 కోట్ల రూపాయలు తక్కువగా ఖర్చు చేసినట్టు పేర్కొన్నారు. అదే సమయంలో వేరియబుల్ కాస్ట్ కింద 3086 కోట్లు, ఇతర ఖర్చుల పేరిట 101 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించినట్లు ఈఆర్సీకి ఇచ్చిన ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. కానీ, వాటికి సంబంధించిన వివరాలు లేవు. కొన్ని సందర్భాల్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గినట్టుగా చూపిరచిన అధికారులు అరదుకు సరైన కారణాలు వివరిరచకపోవడం కూడా ఆశ్చర్యం కలిగిస్తోరదని నిపుణులు అరటున్నారు.
ఎరదుకీ కొనుగోళ్లు?
ఇదే సమయంలో ఒక సంవత్సరం ప్రయివేటు, ప్రభుత్వ రంగ సంస్థలలో ఉత్పత్తి జరిగిన విద్యుత్లో విక్రయం కాకుండా 10,384 మిలియన్ యూనిట్లు మిగులుగా ఉరడగా, 1707 మిలియన్ యూనిట్లను మార్కెట్ నురచి కొనుగోలు చేయడం, అది కూడా ఈఆర్సీ అనుమతిరచిన 294 మి.యూకి దాదాపు ఆరు రెట్లు అదనంగా కొనుగోలు చేయడం ఎందుకో తెలియదు. ఇటువంటి కొనుగోళ్లు చేసిన సమయంలో ఈఆర్సీ నురచి మురదస్తు అనుమతి తీసుకోవాల్సి ఉండగా అటువంటి దాఖలాలే లేవు. స్థానికరగా ఉత్పత్తి జరిగిన విద్యుత్లో మిగిలిన 1765 మిలియన్ యూనిట్లను విక్రయిరచలేదని డిస్కామ్లు చెబుతున్నాయి. దీనికి వేరియబుల్ కాస్ట్గా రూ.4463 కోట్లు అరచనా వేశారు. అయితే ఇదే సమయంలో బయట నురచి 1241 మిలియన్ యూనిట్లను ఎరదుకు కొనుగోలు చేశారో మాత్రం అధికారులు చెప్పలేదు. ఈ కొనుగోలుకు కూడా ఈఆర్సీి అరగీకారం లేకపో వడం గమనార్హం. మస్ట్ రన్ పేరిట నిధుల దుర్వినియోగం జరిగిందన్న అనుమా నాలు నిపుణుల్లో వ్యక్తమవుతున్నాయి. వేరియబుల్ కాస్ట్గా యూనిట్కు 2.29 రూపాయలకు ఇఆర్సి ఆమోదిరచగా, డిస్కామ్లు మాత్రర రూ.2.94 చొప్పున చెల్లించాయి. ఈ చెల్లింపుల నిర్ణయాన్ని ఏ స్థాయిలో తీసుకున్నారో తేలాల్సిఉంది.
తెలంగాణ జెన్కో నుంచి ఎందుకు ఆపినట్టో!
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణ జెన్కో నుంచి హక్కుగా తీసుకోవాల్సిన విద్యుత్ను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. మన రాష్ట్రం నుంచి వారికియ్యవలసిన విద్యుత్ను నిలిపివేసింది. ఏపీకి చెల్లించాల్సిన డబ్బు తెలంగాణ సరిగా చెల్లించకపోవడం కారణంగా పేర్కొన్నారు. అయితే, దానివల్ల దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేసినట్టు ట్రూఅప్ ప్రతిపాద నలబట్టి బోధపడుతోంది. ఇది కూడా ఈఆర్సీ అనుమతిచ్చిన మొత్తానికి అధికం! టి. జెన్కో నుంచి కోనుగోళ్లు నిలిపివే యాలన్న నిర్ణయానికీ ఈఆర్సీ నుంచి అనుమతి పొందిన దాఖలాలేదు. ఇతర చెల్లిరపుల కిరద కూడా ఈఆర్సీ రూ.729 కోట్లకు అనుమతివ్వగా, డిస్కామ్లు రూ.830 కోట్లను చెల్లిరచడాల్ని కూడా నిపుణులు ప్రశ్నిస్తున్నారు
రాష్ట్ర ప్రభుత్వ వైఖరేమిటి?
అంచనాలకు భిన్నంగా చోటుచేసుకన్న ఈ భారీ ఖర్చును కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఈఆర్సీకి సమర్పించింది. గత ప్రభుత్వ విధానాల వల్ల ఏర్పడిన నష్టాలను ప్రజలపై ట్రూఅప్ పేరిట బాదడాన్ని నిపుణులు వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో సన్నిహితంగా ఉండే ఒకరిద్దరు ఉన్నతస్థాయి అధికారులు కూడా ఆ తరహా బాదుడుకు సీఎం వ్యతిరేకమని చెబుతున్నారు.
కొనుగోళ్లు (మిలియన్ యూనిట్లు)
సంవత్సరం ఇఆర్సి డిస్కామ్లు అరతరం
అనుమతి కొన్నది
2016-17 56,805 51,841 -4964
2-17-18 56,854 55,761 -822
వ్యయం(రూ.)
సంవత్సరం ఇఆర్సి డిస్కామ్ల అరతరం
అనుమతి ఖర్చు
2016-17 22,538 25,118 +2,580
2017-18 23,231 25,806 +2576