Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గయ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి..
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హస్తినకు చేరుకున్నారు. రెండు రోజుల పర్యట నలో భాగంగా గవర్నర్ నరసింహన్ దంప తులు ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వచ్చారు. హైదరాబాద్ నుంచి వ్యక్తిగత పనుల మీద గవర్నర్ నరసింహన్ దంపతులు బీహార్ రాష్ట్రంలోని గయా జిల్లాకు వెళ్లారు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చారు. కాగా గయా పర్యటనలో గవర్నర్ నరసింహన్ కొంత అస్వస్థతకు గురైనట్టు సమాచారం. హుటాహుటీన ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది అక్కడి ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్చినట్టు తెలంగాణ భవన్ అధికారులు వెల్ల డించారు. అనారోగ్య కారణంతోనే ఆయన రెండు గంటలు ఆలస్యంగా ఢిల్లీకి చేరుకున్నట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక గవర్నర్ నియా మకం తర్వాత తెలంగాణ గవర్నర్ హౌదాలో నరసింహన్ తొలిసారి ఢిల్లీ పర్యటనకు రావటంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరిం చుకున్నది. తెలంగాణ గవర్నర్ మార్పు ఉంటుందని ఊహాగానాలు వస్తు న్న నేపథ్యంలో ఆయన హస్తిన టూర్ హాట్ టాపిక్గా మారింది.. ఢిల్లీ పర్యటనలో భాగంగా గవర్నర్ మంగళవారం రాష్ట్రపతి కోవింద్, కేంద్ర హౌం శాఖ మంత్రి అమిత్ షా తో భేటి అయ్యే అవకాశం ఉన్నది.