Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరాశలో వ్యాపార రంగం : ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్
న్యూఢిల్లీ : దేశంలో ఆర్థిక వ్యవస్థ మందగమనం నానాటికీ ఆందోళన కలిగిస్తున్నదని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన దేశ ప్రస్తుత ఆర్థిక వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి నుంచి కోలుకోవడానికి తక్షణ చర్యల అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఈ ఏడాది తొలి త్రైమాసికానికి గానూ ఆర్థిక వృద్ధిరేటు 6.8 శాతంగా నమోదు కాగా.. గత కొద్ది రోజులుగా ఆటోమొబైల్, దాని అనుబంధ రంగాల పరిశ్రమల ఉత్పత్తి, అమ్మకాలు మునుపెన్నడూ లేని విధంగా ఇరవై ఏండ్ల కనిష్టానికి పడిపోయాయి. రియల్ ఎస్టేట్, ఎఫ్ఎంసీజీ రంగాలు సైతం నష్టాలను చవిచూడటమే గాక ఈ రంగాల్లో వేలాది సంఖ్యలో ఉద్యోగాలు కనుమరుగవుతున్నాయి. ఈ నేపథ్యంలో రఘురాం రాజన్ మాట్లాడుతూ.. దేశంలో వ్యా పార రంగం తీవ్ర నిరాశలో కూరుకుపోయిందని చెప్పారు. ప్రయివేటు రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముం దుకురావడం లేదనీ, విదేశీ పెట్టుబడులు సైతం వెనక్కిమళ్లుతున్నాయని అన్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే ఆర్థికరం గంలో తక్షణమే సంస్కరణలు చేపట్టవలసిన అవసరముందని స్పష్టం చేశారు. ముఖ్యంగా విద్యుత్, బ్యాంకేతర రంగాల్లో వీటి అవసరమెంతైనా ఉన్నదని నొక్కి చెప్పారు. లేకుంటే ప్రస్తుత ఆటో రంగంలో మాదిరిగానే ఈ రంగాలు కూడా తీవ్రంగా నష్టపోతాయని అంచనా వేశారు.
ప్రయివేటు రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి వారికి తాయిలాలు, ఉద్దీపనలు ప్రకటించాల్సిన అవసరము న్నదని రాజన్ తెలిపారు. ఆ ఉద్దీపనలు ప్రజలకు ఉపయో గపడేలా చేపడితే మరింత ప్రయోజనకరమని చెప్పారు. ఇది భారత వ్యాపార రంగానికి మేలు చేస్తుందని అన్నారు. ఇంకా రాజన్ మాట్లాడుతూ.. జీడీపీ వృద్ధిరేటుపై ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు వేస్తున్న అంచనాల్లో చాలా తేడాలు కనిప ిస్తున్నాయనీ, దీనిపై ఒక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని వివరిం చారు. ఇదే సమయంలో జీడీపీ వృద్ధిరేటును ఎక్కువగా చూపిస్తున్నారని ఆరోపిస్తూ ప్రధాని మోడీ మాజీ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణియన్ చేసిన వ్యాఖ్యలను రాజన్ ప్రస్తావించారు. 2016-17లో జీడీపీ వృద్ధిరేటును ఎక్కువగా చూపించారని సుబ్రహ్మణియన్ ఆరోపించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో స్వతంత్ర సంస్థ ద్వారా అసలైన గణాంకాలు బయటకొస్తాయని రాజన్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2008లో ప్రపంచాన్ని వణికించిన ఆర్థిక మాంద్యం మళ్లీ వస్తుందా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. దానిపై తానిప్పుడే అంచనా వేయలేననీ, కానీ వివిధ రంగాల్లో అది మళ్లీ వచ్చే అవకాశముంటే కొత్త సమస్యలను మాత్రం అది నిరోధించలేదని రాజన్ తెలిపారు.