Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేఎన్యూ పేరు మార్పుపై మాట మార్చిన బీజేపీ ఎంపీ
న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) పేరును మోడీ నరేంద్రభారు యూనివర్సిటీ (ఎంఎన్యూ)గా మార్చాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ హన్స్రాజ్ హన్స్ మాట మార్చారు. తానలా అన్లేదనీ, తన వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్థం చేసుకుందని చెప్పారు. ఓ జాతీయ ఛానెల్తో ఆయన ఫోన్లో మాట్లాడుతూ.. 'విద్యార్థులతో జరిగిన చర్చాగోష్టి కార్యక్రమంలో భాగంగా ఒక విద్యార్థి లేచి జేఎన్యూ అంటే ఏంటో తెలుసా అని నన్ను అడిగాడు. నాకు సమాధానం తెలిసినప్పటికీ తెలియదని చెప్పాను. తిరిగి ఆ విద్యార్థే దాని పూర్తి పేరు చెప్పి నెహ్రూను తన హీరోగా అభివర్ణించాడు. దీనికి నేను బదులిస్తూ.. నా హీరో మోడీ. అయితే ఇది ఎంఎన్యూ అని నేను చెప్పడంతో అక్కడున్నవారంతా గొల్లున నవ్వాం.' అని చెప్పారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందనీ, ఒక కళాకారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన తాను ఇన్నాళ్లు వివాదాలకు దూరంగా ఉన్నానని వివరణిచ్చారు. నెహ్రూ అంటే తనకూ అభిమానమనీ.. కానీ ఆయన తీసుకున్న పలు తప్పుడు నిర్ణయాల కారణంగా జమ్మూకాశ్మీర్లో 370వ ప్రకరణాన్ని తీసుకొచ్చారని హన్స్రాజ్ ఆరోపించారు. నెహ్రూ పండిట్ అయ్యుండి కూడా కాశ్మీరి పండిట్ల గురించి ఆలోచించలేదని విమర్శలు చేశారు.