Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'సుప్రీం'ను కోరిన ఫేస్ బుక్
న్యూఢిల్లీ : సోషల్మీడియా దిగ్గజం ఫేస్బుక్పై ఆధార్ ఖాతా అనుసంధానం, నకిలీ, విద్వేష వార్తల వ్యాప్తికి సంబంధించి మూడు రాష్ట్రాల్లో నమోదైన కేసులను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించాలని ఆ సంస్థ కోరింది. ఈ మేరకు బొంబాయి, మద్రాస్, మధ్యప్రదేశ్ హైకోర్టులలో దాఖలైన మూడు కేసులను అత్యున్నత న్యాయస్థానానికి బదిలీ చేసి వాటి విచారణ చేపట్టాలని జస్టిస్ దీపక్ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనానికి విన్నవించింది.
కాగా, ఈ కేసులో జోక్యం చేసుకోకుండా ఉండాలనీ, ఆయా రాష్ట్రాల పరిధిలోనే విచారణ చేపట్టాలని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్, అడిషినల్ అడ్వకేట్ జనరల్ బాలాజీ శ్రీనివాసన్ కోర్టుకు తెలిపారు. నకిలీ వార్తల వ్యాప్తి, సైబర్ నేరాల కింద ఫేస్బుక్పై నమోదైన కేసుపై మద్రాస్ హైకోర్టు గతంలో స్పందిస్తూ.. ఈ కేసులో విచారణకు సహకరిస్తానని ఆ సంస్థ మాట ఇచ్చిందనీ, కానీ దానికనుగుణంగా నడుచుకోవడం లేదని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ పిటిషన్ను చేపట్టవద్దని తమిళనాడు ప్రభుత్వం కోరింది.