Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జమ్మూ ఎయిర్పోర్టులో అదుపులోకి..
- ఢిల్లీకి పంపిన భద్రతా బలగాలు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ మాజీసీఎం, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్ను పోలీసులు జమ్మూ ఎయిర్పోర్టులో అడ్డుకున్నారు. స్థానికుడైనప్పటికీ ఆయనను జమ్మూలో అడుగుపెట్టనీయలేదు. ఇటీవల శ్రీనగర్ ఎయిర్పోర్టులో ఆయనను పోలీసు లు అడ్డుకుని ఢిల్లీకి తిప్పి పంపించారు. మళ్లీ అదేసీన్ జమ్మూ ఎయిర్పోర్టులో రిపీట్ అయింది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత అయిన ఎంపీ ఆజాద్ను జమ్మూ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనను తిరిగి ఢిల్లీకి పంపించారు. మంగళ వారం మధ్యాహ్నం 1.30 గంటలకు జమ్మూ ఎయిర్పోర్టుకు ఆజాద్ చేరుకున్నారు. విమానం నుంచి దిగగానే పోలీసులు ఆయనను అదుపు లోకి తీసుకున్నారు. అనంతరం ఆజాద్ను ఢిల్లీకి పంపారు. మాజీ ముఖ్య మంత్రిననీ, రాజ్యసభ ప్రతిపక్ష నేతనైన తనను అనుమతించరా? అంటూ భద్రతా బలగాలను ఆజాద్ నిలదీశారు. పైఅధికారుల ఆదేశాల ప్రకారమే తాము నిలువరిస్తున్నట్టు అధికారులు వివరించారు. తన ఇం టికి కానీ జమ్మూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో సమా వేశానికి కానీ వెళ్లడానికి పోలీసులు ఆయనను అనుమతించకపోవడంతో కాంగ్రెస్ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.