Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ మంత్రి ఇంటికి ఆరుగురు బృందం
- నివాసంలో లేకపోవటంతో వెనక్కి
- ఐఎన్ఎక్స్ మీడియా కేసులో బెయిల్ తిరస్కరణతో అరెస్టు?
- సుప్రీంకోర్టుకు మాజీ మంత్రి
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరానికి ఎదురు దెబ్బ తగిలింది. ఐఎన్ఎక్స్ మీడియా ముడుపులకేసులో అరెస్టు కాకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ కోసం దాఖలుచేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. ఇప్పటికే చిదంబరం కస్టడీ కోరుతూ సీబీఐ, ఈడీలు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆరుగురు అధికారుల సీబీఐ బృందం ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లింది. కాగా, కోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరించటంతో ఆయనను అరెస్టు చేస్తారన్న ఊహాగానాలు వెల్లువెత్తాయి. సీబీఐ బృందం ఆయన ఇంటికి వెళ్ళటంతో అవి మరింత ఊపందుకున్నాయి. కాగా, అధికారులు వెళ్లిన సమయంలో చిదంబరం ఇంట్లో లేకపోవడంతో రెండు గంటలు వెయిట్ చేసి.. ఆ తరువాత ఇంటికి నోటిసు అంటించి ఆ బృందం వెనుదిరిగినట్టు సమాచారం.
అసలు ఈ కేసు ఏంటి?
మీడియా కంపెనీ ఐఎన్ఎక్స్పై 2017 మే 15న సీబీఐ ఎఫ్ఐఆర్
నమోదు చేసింది. ఐఎన్ఎక్స్కు లబ్ధి చేకూర్చడానికి విదేశీ పెట్టుబడులను ఆమోదించిన 'ఫారెన్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డ్(ఎఫ్ఐపీబీ)' ఎన్నో అవక తవకలకు పాల్పడిందని ఆరోపించింది. ఈ కంపెనీకి పెట్టుబడులు ఆమో దించిన సమయంలో పి.చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అవకతవకలల్లో చిదంబరం పాత్ర ఉందం టూ ఆరోపణలు వచ్చాయి. దీంతో మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎం ఎల్ఏ) కింద ఈడీ చిదంబరంపై కేసు నమోదుచేసింది. ఈ కేసులో చిదం బరంతో పాటు ఆయన కుమారుడు కార్తి చిదంబరం, ఐఎన్ఎక్స్ మీడియా మాజీ అధినేత ఇంద్రాణీ ముఖర్జీలు నిందితులుగా ఉన్నారు. గతేడాది కార్తిని అరెస్టు చేసిన దర్యాప్తు సంస్థ 23 రోజుల పాటు కస్టడీలో ఉంచి విచారణ చేపట్టాయి. అనంతరం ఆయన బెయిల్పై విడుదలయ్యారు.
కోర్టులో వాదనలిలా..
ఢిల్లీ కోర్టులో చిదంబరం దాఖలు చేసిన ముందస్తు పిటిషన్ను దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలు తప్పుబట్టాయి. విచారణ నుంచి తప్పించుకునేందుకు కేంద్రమాజీ మంత్రి ఇలా చేస్తున్నారని వారు కోర్టుకు తెలిపారు. ఈ పరిణామాల మధ్య చిదంబరం తరఫు న్యాయవాది దాఖలు చేసిన ముందస్తు బెయిల్ను కోర్టు తిరస్కరించింది. ఆయన చట్టసభ సభ్యుడైనంత మాత్రాన ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిన అవసరంలేదని స్పష్టంచేసింది. కాగా చిదంబరంను అరెస్టు చేయకుండా మూడు రోజులపాటు రక్షణ కల్పించాలని ఆయన తరఫు న్యాయవాది దయాన్ కృష్ణన్ కోర్టుకు విజ్ఞప్తిచేశారు. ఈ అభ్యర్థనను పరిశీలించి, తర్వాత ఉత్తర్వులు జారీ చేస్తామని కోర్టు తెలిపింది.
నెక్ట్స్ ఏంటి?
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం కీలక కుట్రదారుడుగా సీబీఐ భావిస్తుండగా, ఈ కేసులో సమర్థవంతమైన దర్యాప్తు కోసం ఆయన కస్టోడియల్ విచారణ అవసరమని ప్రాథమికంగా అభిప్రాయపడుతున్నట్టు కోర్టు పేర్కొంది.
మరోవైపు హైకోర్టు చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో.. ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సాధ్యమైనంత త్వరలో ఈ పిటిషన్పై విచారణ చేపట్టాలని చిదంబరం తరఫు న్యాయవాది కపిల్ సిబల్ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఓ వైపు సీబీఐ బృందాలు చిదంబరంను అరెస్టు చేసే దిశగా అడుగులు వేస్తుంటే..మరోవైపు సుప్రీంలో వేసిన పిటిషన్ ఊరటనిస్తుందా అన్న దానిపై చర్చ సాగుతుండగా, మరోవైపు మోడీ సర్కార్ కావాలనే కేంద్రమాజీ మంత్రిపై కుట్రలు చేస్తున్నదని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.