Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడి
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
పోలవరం రివర్స్ టెండరింగ్, విద్యుత్ పీపీఏ రద్దు నిర్ణయం ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాల పూర్తి ఆశ్శీసులతోనే తీసుకున్నట్టు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి వెల్లడించారు. కేంద్రంతో తమ సర్కారు సత్సంబంధాలు కొనసాగిస్తుందని ఆయన చెప్పారు. ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్న కూడా ప్రధానిని, హోం మంత్రిని సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు. ఈ అంశంలో టీడీపీ దుష్ప్రాచారాన్ని నమ్మొద్దన్నారు. రాజధాని అమరావతి మార్పుపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మీడియాకు తెలియకుండా ఉండదని, ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోని దానిపై చర్చించడం అనవసరమని అన్నారు. రాజధాని ముంపుకు గురవ్వడం వాస్తమన్నారు. పప్పునాయుడు (లోకేష్) ఏం ట్విట్లు చేస్తున్నారో ఆయనకే తెలియదన్నారు.అదేవిధంగా విశాఖ రైల్వే జోన్లో వాల్తేర్ డివిజన్ను ఉపసంహరించుకోవాలనే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ వ్యతిరేకిస్తుందని విజయసాయి తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. రైల్వే మంత్రిని కలిసిన వారిలో ఎంపిలు బెల్లాన చంద్రశేఖర్, జి. మాధవి, శ్రీకృష్ణదేవరాయులు, ఎంవివి సత్యనారాయణ, గోరంట్ల మాధవ్, రఘురామ కృష్ణంరాజు, సంజీవ్ కుమార్ తదితరులు ఉన్నారు.
ఏపీ సర్కారు తమకు ప్రత్యేక స్నేహితుడు: పీయూష్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు స్నేహితుడు వంటిదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ అన్నారు. ఏపీ ప్రజలు ప్రయోజనాలు, జాతీయ స్థాయి ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
ఏపీ రాజధాని మార్పుపై కిషన్రెడ్డి ..
హైదరాబాద్ : ఏపీ రాజధాని మార్పుపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోదనికేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ఈ అంశం కేంద్రం పరిధిలోకి రాదన్నారు. హైదరాబాద్ను దేశానికి రెండో రాజధాని చేయబోతున్నారన్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, మున్సిపల్ ఎన్నికలు తమ లక్ష్యం కాదని, తమ టార్గెట్ 2023 అసెంబ్లీ ఎన్నికలని అన్నారు. బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షులు జేపీ నడ్డా ఎవరో తనకు తెలియదని కేటీఆర్ చేసిన కామెంట్పై వ్యాఖ్యానిస్తూ, నడ్డా ఎవరో తెలియకుండానే గతంలో కేటీఆర్ కలిశారా అని ప్రశ్నించారు.