Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీలో వేలాదిమంది దళితుల ప్రదర్శన
- అక్కడే గుడి నిర్మించాలని డిమాండ్
న్యూఢిల్లీ : తలపై నీలంరంగు టోపీ, చేతిలో నీలం జెండా చేతబూని దేశరాజధానిలో దళితులు కదం తొక్కారు. వేలాది మంది దళితులు అంబేద్కర్ భవన్ నుంచి రాంలీలా మైదాన్ వరకూ ప్రదర్శన నిర్వహిం చారు. ఆ ప్రాంతమంతా నీలం మయమైంది. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డీడీఏ) అధికారులు ఈనెల 10న తుగ్లకా బాద్ అటవీ ప్రాంతంలోని రవిదాస్ మందిర్ను కూల్చి వేసిన విషయం తెలిసిందే. కూల్చివేతను నిరసిస్తూ పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన దళితులు కదం తొక్కారు. ఆ భూమిని అప్పగించాలనీ, అలాగే ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం స్థలం కేటాయించాలని వారు డిమాండ్చేశారు. పలు రాజకీయ పార్టీల నేతలు ఆందోళనకు మద్దతు పలికాయి.
రవిదాస్ మందిర్ను ప్రస్తుతమున్న తుగ్లకాబాద్ అటవీ ప్రాంతంలో నిర్మిం చాలని లేనిపక్షంలో ప్రత్యామ్నాయంగా వేరొక ప్రాంతంలో నిర్మించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ సామాజిక న్యాయ శాఖ మంత్రి రాజేంద్ర పాల్ గౌతం, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ సహా పలువురు దళిత నేతలు నిరసనకారులనుద్దేశించి ప్రసంగించారు. తాను దళిత ప్రతినిధిగా ఇక్కడ మాట్లాడుతున్నాను తప్ప, ఢిల్లీ మంత్రిగానో, రాజకీయ నాయకుడిగానో కాదని రాజేంద్రపాల్ గౌతం అన్నారు. న్యాయస్థానాన్ని తాము గౌరవిస్తామనీ, కానీ ప్రభుత్వం దళితుల ఆలయాలనే ఎందుకు కూల్చివేస్తున్నదో? దేశ వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలపై దాడి ఎందుకు జరుగుతున్నదో సమాధానం చెప్పాలని కేంద్రాన్ని డిమాండ్చేశారు. తమకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా దళితులు పోరాడుతున్నారనీ, సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా కాదని గౌతం చెప్పారు. తమ డిమాండ్ నెరవేరేవరకూ పోరాటం కొనసాగిస్తామని దళితులు ఈ సందర్భంగా ప్రతినబూనారు.