Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. బుధవారం జమ్మూకాశ్మీరులోని రాజౌరీ జిల్లా, సుందర్బన్ సెక్టార్లో ఎటువంటి హెచ్చరికలూ లేకుండానే కాల్పులకు తెగబడింది. పాక్ దళాల దుస్సాహసాన్ని భారత బలగాలు దీటుగా తిప్పికొట్టాయి. అలాగే పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ పరిధిలో పాక్ సైన్యం భారీ మోర్టార్షెల్తో దాడిచేయడంతో ఓ పౌరుడు చనిపోయాడు. మేందర్, కష్ణఘాటి సెక్టార్లలో చోటుచేసుకున్న కాల్పుల్లో భారత సైనికుడు నాయక్ రవి రంజామ్ కుమార్ మరణించగా, మరో నలుగురు సిబ్బంది గాయపడ్డారు. కాల్పుల్లో దాదాపు అరడజనుకు పైగా ఇండ్లు దెబ్బతిన్నాయి.