Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారతరైల్వే నిర్ణయం
న్యూఢిల్లీ: గాంధీ జయంతిని పురస్కరించుకుని తమ పరిధిలో అక్టోబర్ 2 నుంచి 'సింగిల్ యూజ్ ప్లాస్టిక్' వాడకంపై నిషేధం విధిస్తున్నట్టు భారత రైల్వే బుధవారం ప్రకటించింది. ఈ క్రమంలో ప్లాస్టిక్ మంచినీటి బాటిళ్లను తిప్పిపంపేందుకు ఏర్పాట్లు చేసింది. మొదటి దశలో 360 ప్రధాన రైల్వే స్టేషన్లలో 1853 ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల క్రషింగ్ యంత్రాలను ఏర్పాటుచేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. అలాగే ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, ఆయా వస్తువులను వాడకానికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)ను కోరింది. రైల్వే ప్రాంగణాలు, రైళ్లలో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల స్థానంలో పునర్వినియోగ వస్తువులను వాడేలా తమ పరిధిలోని వాణిజ్య సముదాయాల్లో విక్రయాలను ప్రోత్సహించాలని సూచించింది. ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని అనుమతించబోమనీ, దానిని పూర్తిగా నిషేధిస్తున్నట్టు భారతీయ రైల్వే బోర్డు ప్రకటించింది.