Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాఠశాలలకు హాజరుకాని విద్యార్థులు
- కొనసాగుతున్న ఇంటర్నెట్ సేవల రద్దు
శ్రీనగర్ : కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో బుధవారం ఆంక్షలను పాక్షికంగా సడలించినట్టు అధికారులు తెలిపారు. పాఠశాలలు పున:ప్రారంభించాలని అధికారులు ఆదేశించినప్పటికీ సిబ్బంది మాత్రమే విధులకు హాజరయ్యారు. విద్యార్థులు హాజరుకాకపోవడంతో పాఠశాలలు బోసిపోయినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపేందుకు భయపడుతున్నారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లను తొలగించామని, అయితే భద్రతా దళాల మోహరింపు మాత్రం కొనసాగుతున్నట్టు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ల్యాండ్ఫోన్లను పునరుద్ధరించగా, మొబైల్, ఇంటర్నెట్ సేవల నిలిపివేత 17వ రోజుకూడా కొనసాగుతున్నదని అన్నారు.