Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎఫ్డీఐ నిబంధనలు ఉల్లఘించారని సీబీఐ ఆరోపణలు
న్యూఢిల్లీ: ఎన్డీటీవీ ప్రణయ్ రాయ్ పై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) మరో కేసు నమోదు చేసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుడుల (ఎఫ్డీఐ) నిబంధనలు ఉల్లఘించారనే ఆరోపణలతో ఎన్డీటీవీ ప్రమోటర్లు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ తో పాటు మరికొంత మందిపై కేసు నమోదైంది. ఈ కేసులో ఎన్డీటీవీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డైరెక్టర్ విక్రమాదిత్యతో పాటు మరికొంతమంది ఆదాయపన్ను శాఖ అధికారులు నిందితులుగా ఉన్నారు. 2004 నుంచి 2010 మధ్యలో ఎన్డీటీవీ అధికారులు మనీలాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై విచారిస్తుండగా వెల్లడైన ప్రాథమిక సమచారం ఆధారంగా ఈ కేసు నమోదు చేసినట్టు సీబీఐ తెలిపింది. యూకే, దుబాయ్, మలేషియా వంటి దేశాల్లో ఎన్డీటీవీకి అనుబంధంగా 32సంస్థలున్నాయని వెల్లడించింది. ఇందులో కొన్నింటిలో మాత్రమే వ్యాపార లావాదేవీలు జరిగేవనీ, మిగతా కంపెనీలు కేవలం విదేశాలనుంచి నిధులు మళ్లించడానికే ఉపయోగించినట్టు తెలిసిందని వివరించింది. ఎన్డీటీవీ విదేశీ సంస్థలను షెల్ సంస్థలుగా ఉపయోగిస్తూ కొంతమంది ప్రభుత్వాధికారులు పెట్టుబడులు పెట్టి వాటిని అక్రమంగా తిరిగి భారత్కు రప్పిస్తున్నారని సీబీఐ ఆరోపించింది.