Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్ పన్నులను తగ్గించేందుకు కేంద్రం యోచన
న్యూఢిల్లీ : సంపద సృష్టికర్తలు (శ్రామికులను కాదని) పారిశ్రామిక వేత్తలేనని కితాబిచ్చిన మోడీ సర్కా రు వారికి మరిన్ని ప్రయోజనాలను చేకూర్చేం దుకు యోచిస్తున్నది. కార్పొరేట్ పన్నులను తగ్గించేందుకు అడుగులు వేసు ్తన్నది. సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ (సీబీడీటీ) సభ్యుడు అఖిలేశ్ రంజన్ నేతృత్వంలోని ప్యానెల్ కేంద్ర ఆర్థిక మంత్రికి సమర్పించిన రిపోర్టులో కార్పొరేట్ పన్నులను 30శాతం నుంచి 25శాతానికి కుదించాలని పేర్కొన్నట్టు సమాచారం. అంతేకాదు, 400కోట్లకు పైబడి టర్నో వర్ ఉన్న కంపెనీలకు కార్పొరేట్ పన్నును తగ్గిస్తామని స్వయం గా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. కానీ, కార్పొరేట్ కంపెనీలు సర్కారు నిర్దే శించినస్థాయిలో పన్నులు కట్ట డం లేదు. కేంద్రబడ్జెట్లో కార్పొ రేట్ పన్నులకు సంబంధించి పొందుపరిచిన దస్త్రాల ప్రకారం.. కార్పొరేటు కంపెనీలు కట్టాల్సిన పన్నుల కంటే తక్కువే కడుతున్నాయని తెలుస్తు న్నది. ఇప్పటికే తక్కువ కడుతూ ఉండగా వీటికి మరింత పన్ను తగ్గిస్తామని ప్రకటించడం కేంద్రం ప్రకటించడం గమనార్హం. రూ.500 కోట్లకు పైబడి టర్నోవర్ చేసిన కం పెనీలు సర్కారునిర్దేశించిన 34.61 శాతం కార్పొరేటు పన్నుకు బదులు 26.3శాతం మేర సుంకం కట్టడం గమనార్హం.
పెద్ద కంపెనీల చిన్న పన్నులు :
2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 8,41,687 కార్పొరేటు రిటర్నులు (2019 మార్చి 31నాటికి) దాఖలైన వివరాలను పరిశీలిద్దాం. బడ్జెట్ డ్యాక్యుమెంట్ల ప్రకారం.. 3.91 లక్షల కంపెనీలు(46.41శాతం కంపెనీలు) రూ. 15.18 లక్షల కోట్లు (పన్నుల్లేకుండా).. లేదా రూ. 11.24 లక్షల కోట్లు (పన్నులతో) ఆర్జించాయి. కాగా, 3.61 లక్షల కోట్ల కంపెనీలు(43.11 శాతం కంపెనీలు) రూ. 9.08 కోట్ల నష్టాన్ని చూపాయి. కాగా, మరో 88,214 కంపెనీలు ఆదాయాన్ని చూపించలేవు. పన్నులు ఎగ్గొట్టేందుకు చాలా కంపెనీలు నష్టాన్ని చూపించడమో లేదా ఆదాయాన్ని చూపించకపోవడమో చేస్తుంటాయని పరిశీలకులు భావిస్తుంటారు. కార్పొరేట్ కంపెనీల ఆదాయాలను బట్టి పన్ను శ్లాబులు మారుతుంటాయి కాబట్టి సగటు స్టాటుటరీ ట్యాక్స్ను సర్కారు లేదా ప్రభుత్వోద్యోగులు 30శాతంగా పేర్కొంటుంటారు. టర్నోవర్ కోటి రూపాయల్లోపు ఉంటే కార్పొరేట్ ట్యాక్స్ 30.09 శాతం, ఒకటి నుంచి 10 కోట్లుంటే 33.06 శాతం, 50 నుంచి 100కోట్లు, 100 నుంచి 500కోట్లు, 500 కోట్లకు పైబడి టర్నోవర్ ఉన్న సదరు కార్పొరేట్ కంపెనీ 34.61శాతం కార్పొరేట్ ట్యాక్సును చెల్లించాలి. కానీ, డాక్యుమెంట్లను పరిశీలిస్తే.. ఒక కోటి నుంచి 500 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న కంపెనీలు 27.38 నుంచి 29.09 శాతం మధ్యలో పన్నులు కట్టాయి. కోటి లోపు టర్నోవర్ గల కంపెనీలు 26.39శాతం పన్ను చెల్లించాయి. కాగా, 500 కోట్లకు పైబడిన సంపాదనగల కంపెనీలూ 26.3శాతం పన్నులు కట్టడం గమనార్హం.
సర్కారు మెహర్బానీ!
500 కోట్లకు పైబడి టర్నోవర్ గల కంపెనీలు 373 ఉండగా.. 2017-18లో వాటి ఆదాయం రూ. 8.86లక్షల కోట్లు(అన్ని కార్పొరేట్ కంపెనీల మొత్తంలో 46శాతం)గా రికార్డయింది. కాగా, అవి చెల్లించిన పన్ను 2.3 లక్షల కోట్లు(మొత్తం పన్నుల్లో 52శాతం).
అయినప్పటికీ అవి 34.61శాతం కాకుండా.. కేవలం 26.3శాతం పన్ను మాత్రమే చెల్లించాయి. దీనికి కారణం ట్యాక్స్ లూప్హౌల్స్. అలాగే, కేంద్రం కొన్ని రంగాల్లోని కంపెనీలకు పన్నులో మినహాయింపునిస్తుంది. అయితే, పన్ను మినహాయింపులు ఇచ్చిన రంగాల్లో ఈ పెద్ద కార్పొరేట్ కంపెనీలే ఉండటం గమనార్హం.