Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక మందగమనంపై గడ్కరీ
ముంబయి: 'దేశంలో తలెత్తిన ఆర్థిక మందగమనం వల్ల పరిశ్రమలు కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నా యని నాకు తెలుసు. కానీ ఈ పరిస్థితి తొందర్లోనే మారిపోతుంది. జీవితంలోనైనా, వ్యాపారంలోనైనా ఒడిదుడుకులు సహజం. పారిశ్రామికవేత్తలెవరూ ఆత్మవిశ్వసాన్ని కోల్పోవద్దు' అని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఆయన మహారాష్ట్రలోని నాగపూర్లో నిర్వహించిన విదర్భ ఇండిస్టీస్ 65వ వార్షికోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ.. పరిశ్రమలకు చేయూతనిచ్చేలా వృద్ధి రేటును పెంచాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలిపారు. ఇటీవల ఆయన కొంతమంది ఆటోమొబైల్ రంగానికి చెందిన వారిని కలిసినప్పుడు వారిలో ఆందోళన కనిపించిందని అన్నారు. ఆ సమయంలో వారికి ధైర్యం చెబుతూ.. జీవితమన్నాక ఆనందం, బాధ, విజయం, అపజయం అన్నీ ఉంటాయని చెప్పినట్టు గుర్తుచేశారు. ఆర్థికమందగనం ప్రపంచమంతా ఉందనీ, దాని ప్రభావమే భారత్లోనూ పడిందని తెలిపారు. కాబట్టి ఎవరూ నిరాశ చెందవద్దని అన్నారు. రానున్న రోజుల్లో మనం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నామని వెల్లడించారు.