Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బలవంతంగా 'హిందీ' రుద్దడం తగదు
- ఈ నిర్ణయం బానిసలుగా చేయడమే : కేరళ సీఎం
తిరువనంతపురం: హిందీని జాతీయ భాషగా ఉండాలనే నేపథ్యంలో 'ఒకే దేశం-ఒకే భాష' అంటూ కేంద్ర హౌంమంత్రి అమిత్ షా చేసిన ట్వీట్తో దక్షిణాది రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. షా ప్రకటనతో ఏకిభవించని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో తాజాగా కేరళ సీఎం పినరయి విజయన్ సైతం షా ప్రకటనను వ్యతిరేకించారు. షా ప్రకటన మరో భాషాపరమైన యుద్ధానికి దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. హిందీ మాత్రమే దేశాన్ని ఏకం చేస్తుందనేది తప్పుడు అభిప్రాయమని హితవు పలికారు. బలవంతంగా ఒక భాషను ప్రజలపై రుద్దడం బానిసలుగా చేయడమేనని వ్యాఖ్యానించారు. ''హిందీ మాత్రమే దేశాన్ని ఏకం చేయగలదనడం సహేతుకం కాదు. అది చాలా మంది భారతీయుల మాతభాష కాదు. ఒకవేళ బలవంతంగా రుద్దాలని చూస్తే అది వారిని బానిసలుగా చేస్తుంది. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు హిందీయేతర భాషలు మాట్లాడేవారిపై దాడి చేయడమే'' అని ట్విట్టర్లో పేర్కొన్నారు.