Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రుల అసహజ ప్రకటనల వల్ల మాంద్యం ఆగదు
- ట్రక్కుల అమ్మకాలు పడిపోవడానికీ ఓలా, ఉబర్లే కారణమా? : మోడీ సర్కార్కు మాజీ ఆర్థికమంత్రి యశ్వంత్సిన్హా సూటి ప్రశ్న
న్యూఢిల్లీ : కేంద్రమంత్రులు అసహజ ప్రకటనలు చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ గాడిలో పడదని, ప్రభుత్వ ప్రతిష్ట మరింత దిగజారుతుందని మాజీ ఆర్థికమంత్రి, బీజేపీ మాజీనేత యశ్వంత్సిన్హా హితవు పలికారు. ఓలా, ఉబర్లాంటి అద్దె సర్వీసుల వైపు ఆదాయవర్గాలు మొగ్గు చూపడం వల్ల వాహ నాల అమ్మకాలు పడిపోయాయంటూ ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ సమర్థించుకోజూడటాన్ని సిన్హా తప్పు పట్టారు. అదే నిజమైతే సరుకు రవాణా ట్రక్కు ల అమ్మకాలు ఎందుకు పడిపోయాయని ఆయన ప్రశ్నించారు. ఓవేళ అద్దె సర్వీసులవైపు జనం మొగ్గు చూపితే, ప్రయాణ వాహనాల అమ్మకాలపై అది కొంత ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు. కానీ, సరుకు రవాణా వాహనాల అమ్మకాలు కూడా పడిపో వడంతో ఆర్థికమంత్రి ప్రకటనను ఎవరూ సమర్థించ డంలేదు. ఓలా, ఉబర్ వల్ల అమ్మకాలు తగ్గాయన్న అభిప్రాయంతో తాను ఏకీభవించనని మారుతీ సుజు కీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శషాంక్శ్రీవాస్తవ స్పష్టం చేశారు. ఓలా, ఉబర్ 6, 7 ఏండ్ల నుంచే నడుస్తున్నాయని, ఈ కాలంలో వాహనాల అమ్మకా లు బాగానే ఉన్నాయని, గత కొన్ని నెలలుగానే అమ్మకాలు పడిపోయాయని శ్రీవాస్తవ వివరించారు.
వాహనాల అమ్మకాలు పడిపోవడానికి వర్షాలు కార ణమని బీహార్ ఆర్థికమంత్రి సుశీల్మోడీ అనగా, కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఐన్స్టీన్ గురుత్వా కర్షణ అంటూ హాస్యమాడారు.
గోయల్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో అలజడి మొదలైంది. కారణం.. గురుత్వాకర్షణ సిద్ధాంతం చెప్పింది ఐజాక్ న్యూటన్. గురుత్వాకర్షణ సిద్ధాంతంలో లోపం ఉన్నదంటూ (తన సాధారణ సాపేక్ష సిద్ధాంతంలో భాగంగా) స్థల, కాల వక్రీభవన సిద్ధాంతాన్ని ఐన్స్టీన్ చెప్పడం గమ నార్హం. ఐన్స్టీన్ సిద్ధాంతం సరైందేనని శాస్త్రవేత్తల ప్రయోగాల్లో రుజువైంది. అది సంక్లిష్టమైన భౌతిక సూత్రాలకు సంబంధించిన అంశం. సోషల్ మీడి యాలో విమర్శలు రావడంతో గోయల్ తన తప్పే మిటో తెలుసుకొని వివరణ ఇచ్చారు. ఏ తప్పూ చేయ ని వ్యక్తి కొత్తగా ఏదీ కనిపెట్టలేరంటూ ఐన్స్టీన్ చెప్పి న మాటల్నే గోయల్ గుర్తు చేశారు. ఎగుమతుల ప్రోత్సాహానికి దుబాయి షాపింగ్ ఫెస్టివల్ను పోలిన మెగా షాపింగ్ ఫెస్టివల్ను భారత్లోనూ నిర్వహిస్తా మంటూ నిర్మలాసీతారామన్ చేసిన వ్యాఖ్యలపైనా సిన్హా విమర్శ చేశారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, భారత్ ఆర్థిక వ్యవస్థ లకూ పోలిక లేదని సిన్హా గుర్తు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి వ్యవసాయ రంగం కీలకమని ఆయన సూచించారు. మధ్యప్రదేశ్ లోని మందసౌర్లాంటి ప్రాంతాల్లో రైతులను అభివృద్ధిలోకి తేవాలని ఆయన హితవు పలికారు. మన జీడీపీ వృద్ధిరేట్ కనీసం 8 శాతమైనా ఉండాలని, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 5 శాతా నికి పడిపోవడం నిరాశ కలిగిస్తోందని ఆయన అన్నారు. ఒక త్రైమాసికంలో 3 శాతం వృద్ధి తగ్గిందంటే, దాని అర్థం రూ.6 లక్షల కోట్ల నష్టమని సిన్హా గుర్తు చేశారు.