Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెయిల్, ముందస్తు బెయిల్పై విచారణ నిమిత్తం ఏర్పాటు
- సుప్రీంకోర్టు చరిత్రలోనే తొలిసారి
న్యూఢిల్లీ : నానాటికీ పెరుగుతున్న కేసులను సత్వరంగా పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకున్నది. పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ బెయిల్, ముందస్తు బెయిల్ కోసం అప్పీలు చేసుకునే కేసులను ఇకనుంచి ఏకసభ్య ధర్మాసనం (సింగిల్ జడ్జి బెంచ్) విచారించేలా చట్టంలో సవరణలు చేసింది. దీంతోపాటు అత్యవసరంగా వినాల్సిన సివిల్ ప్రొసీజర్ కోడ్ (సీపీసీ) సెక్షన్ 25, సీఆర్పీసీ సెక్షన్ 406కి సంబంధించి బదిలీ కేసులను సైతం ఏకసభ్య ధర్మాసనం విచారించేందుకు ఆస్కారం కల్పించారు. ఈ మేరకు 2013, సుప్రీంకోర్టు నిబంధనలలో సవరణలు చేశారు. ఇందుకు సంబంధించి రెండ్రోజుల క్రితమే కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు బెయిల్, ముందస్తు బెయిల్, బదిలీ కేసులను ద్విసభ్య ధర్మాసనం మాత్రమే విచారించేది. సవరణల తర్వాత సింగిల్ జడ్జి బెంచ్ను సుప్రీంకోర్టు ప్రదాన న్యాయమూర్తి నియమిస్తారు. సంబంధిత న్యాయమూర్తే ఆ కేసులను విచారిస్తారు.