Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 32 లక్షల నగదు, 10 వేల అమెరికన్ డాలర్ల స్వాధీనం
న్యూఢిల్లీ: తణమూల్ కాంగ్రెస్ (టీఎంసీి) ఎంపీ కన్వర్ దీప్ సింగ్ అధికారిక నివాసంలో సోదాలు నిర్వహించి, రూ .32 లక్షలు, 10,000 అమెరికన్ డాలర్ల నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం తెలిపింది. మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సోదాలు చేసినట్టు సమాచారం. ఢిల్లీలోని ఎంపీ నివాసంతో సహా ఆల్కెమిస్ట్ గ్రూపులోని 14 కంపెనీల కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. ఈ సోదాల్లో అనేక కీలక డాక్యుమెంట్లతో పాటు, విదేశీ డబ్బును కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఎంపీ కేడీ సింగ్, తన కుమారుడు కలిసి, 2012 లో అల్కెమిస్ట్ టౌన్షిప్ ఇండియా లిమిటెడ్ను ప్రారంభించారు. తక్కువ మొత్తంతోనే విలువైన ప్లాట్లను అందజేస్తామని వేలాది మంది వినియోగదారులను మోసం చేశారు. ఈ కేసులో ఎంపీ, తన కుమారుడితో పాటు, సంస్థ ఇతర డైరెక్టర్లపై కూడా కేసు నమోదైనట్టు అధికారులు తెలిపారు. కాగా, సెబీ నిబంధనలకు వ్యతిరేకంగా ఆల్కెమిస్ట్ ఇన్ఫ్రా రియాల్టీ లిమిటెడ్ అనే మరో కంపెనీని ప్రారంభించి, పెట్టుబడులను స్వీకరించినట్టు ఆరోపణలు వచ్చాయి.
ందులో దాదాపు1900 కోట్ల కుంభకోణం జరిగినట్టు చార్జీషీట్లో ఈడీ దాఖలు చేసింది. ఈ కేసుల్లో గతేడాదే ఈడీ దర్యాప్తు ప్రారంభించినా.. రాజకీయ ప్రలోభాల వల్ల ఈ కేసులను పక్కన పెట్టినట్టు పలు విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.