Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఎం మోడీకి సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా లేఖ
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
సేవ్ నల్లమల ఉద్యమానికి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా మద్దతు తెలిపారు. యురేనియం తవ్వకాలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు జరుగుతున్నాయని రాజా చెప్పారు. యురేనియం తవ్వకాల కారణంగా నల్లమల అడవుల్లో వేల సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తున్న చెంచు జాతులు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఛత్తీస్గడ్లోని జోడాబాగ్లో కనీస ప్రమాణాలు పాటించకుండా విచ్చలవిడిగా తవ్వకాలు జరపడం వల్ల అక్కడి ప్రజానీకం రక్తస్రావం, చర్మ సమస్యలతో ఇబ్బందులు పడినట్టు గుర్తు చేశారు. అందుచేత, నల్లమల అటవీప్రాంతంలో ఇదే రకమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే తవ్వకాలపై ప్రభుత్వం వెనక్కి తగ్గాలని సూచించారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వ సంస్థలు నల్లమల అడవుల్లో జరుపుతున్న అన్వేషణలు, తవ్వకాలను నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో ఉద్యమాలు చేపడతామని కేంద్రాన్ని ఆయన హెచ్చరించారు.