Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లా విద్యార్థిని లైంగికదాడి కేసులో కేంద్రమాజీ మంత్రి..
- 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ
- ఆరోపణలన్నీ నిజమేనని ఒప్పుకున్నాడు : దర్యాప్తు అధికారి
న్యూఢిల్లీ : లైంగికదాడి ఆరోపణల్లో బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద్ (73)ను సిట్ అధికారులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ జిల్లాలోని ఆశ్రమలో వున్న ఆయనను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జిల్లా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా చిన్మయానంద్కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. లైంగిక సంభాషణలు, బాడీ మసాజ్ సహా తనపై వచ్చిన ఆరోపణలన్నీ చిన్మయానంద్ అంగీకరించాడని ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహిస్తున్న నవీన్ అరోరా చెప్పారు. 'నేను చేసినదానికి సిగ్గుపడుతున్నాను... ఇంతకంటే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదని చిన్మయానంద్ చెప్పారు' అని నవీన్ అరోరా తెలిపారు. బాధితురాలు సమర్పించిన వీడియోలను చూపించిన తర్వాత చిన్మయానంద్ తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించారన్నారు.
తనను బెదిరించి ఏడాది లైంగికదాడి, శారీర హింసకు బీజేపీ నేత పాల్పడ్డాడంటూ లా విద్యార్థిని (23) ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో సాక్ష్యాలను కూడా బాధితురాలు సిట్ అధికారులకు అప్పగించింది. లా కాలేజీలో సీటు కోసం ఆయన ఆశ్రమానికి వెళ్ళగా.. సీటు ఇచ్చాడనీ, కళాశాలలోని లైబ్రరీలో పార్ట్ ఉద్యోగం కూడా ఇచ్చాడని బాధితురాలు తెలిపింది. అనంతరం కళాశాల హాస్టల్లోనే ఉండాల్సిందిగా తనను కోరినట్టు చెప్పింది. కాగా తాను స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీయించిన చిన్మయానంద్.. తనను బ్లాక్ మెయిల్ చేస్తూ ఏడాది పాటు లైంగికదాడి, శారీరక హింసకు పాల్పడ్డా డంటూ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తుపాకీ గురిపెట్టి బాడీ మసాజ్ చేయించుకునేవాడని ఆరోపిం చింది. ఇదే విషయాన్ని ఆమె కోర్టులో న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇచ్చింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో రంగంలోకి దిగిన యూపీ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటుచేశారు. బాధితురాలి తండ్రి, ఆమె స్నేహితులతో సహా 20 మందిని గత వారం రోజులుగా సిట్ బృందం ప్రశ్నించింది. శుక్రవారం ఉదయం షాజహాన్పూర్లోని చిన్మయానంద్ ఆశ్రమానికి చేరుకున్న సిట్ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.