Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మక్కల్ నీది మయ్యం అధినేత కమల్
చెన్నై : ప్రజల సమస్యల పట్ల ప్రభుత్వాలను ప్రశ్నించాలనీ, న్యాయం జరగకుంటే కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉండాలనీ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే అధికార పార్టీకి చెందిన నాయకుడి హౌర్డింగ్ పడి మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శుభశ్రీ ఉదంతం పట్ల తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, రాజకీయ నాయకుల ప్రచారానికి ఇంకెంత మంది శుభశ్రీలు చనిపోవాలని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'అసలు కొంతమంది రాజకీయ నాయకులకు ఎక్కడ హౌర్డింగ్లు పెట్టాలో తెలియని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే శుభశ్రీ, రఘు వంటి ఎంతో మంది తమ ప్రాణాలను కొల్పోయారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా ప్రజా సమస్యల ప్రస్తావించడం, ప్రశ్నించడం మనుకోబోనని' చెప్పారు.