Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేముల రోహిత్, పాయల్ తాడ్వీల తల్లుల పిటిషన్పై..
న్యూఢిల్లీ : విశ్వవిద్యాలయాలలో కులవివక్షను అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈమేరకు కులవివక్ష కారణంగా బలైన విద్యార్థులు వేముల రోహిత్, పాయల్ తాడ్వీల తల్లులు దాఖలు చేసిన పిటిషన్పై స్పందిస్తూ.. జస్టిస్ ఎన్ వి రమణ, జస్టిస్ అజరు రస్తోగిలతో కూడిన ధర్మాసనం పై విధంగా స్పందించింది. ఉన్నత విద్యా సంస్థలు, వర్సిటీలలో ఈ వివక్షకు ముగింపు పలకాలని కోరుతూ బాధితుల తల్లులిద్దరూ కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ అంశంపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (న్యాక్)లకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.