Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్కరోజులోనే క్వింటాల్పై రూ. 1000 పెరిగిన ధర
- దక్షిణాదిలో తగ్గిన ఉత్పత్తి.. డిమాండ్ పైపైకి
నాసిక్ : ఉల్లిని కోస్తేనే కాదు.. ఇప్పుడు కొంటేనే కన్నీరు వచ్చేట్టున్నది. సామాన్యుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్నాయి. ఇకపై మార్కెట్కు వెళితే.. వాటిని కొనుగోలు చేసేందుకు ప్రత్యేకంగా లెక్కలు వేసుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఉల్లి ధర అనూహ్యంగా నాలుగేండ్ల గరిష్టానికి చేరింది. ఒక్కరోజులోనే ఎకాఎకిన క్వింటాల్పై రూ. 1000 మేరకు పెరిగింది. మహారాష్ట్రలో నాసిక్ జిల్లాలోని లాసల్గావ్లో దేశంలోనే అత్యంత పెద్ద హౌల్సేల్ మార్కెట్(ఏపీఎంసీ)లో ఈ పెరుగుదలతో క్వింటాల్ ఉల్లి సగటు ధర రూ. 4,500లకు ఎగబాకింది. మరో రెండు రోజుల్లో పెరిగిన ధరలు రిటేల్ మార్కెట్లలో ప్రతిఫలించ నుండటంతో సామాన్యులు దిగాలుపడుతు న్నారు. మొన్నటి వరకు టమాట ధరలు మోతమోగించగా.. ఇప్పుడు ఉల్లిధర మరోసారి కంటతడి పెట్టిస్తున్నది. సామా న్యుడి ఇంటి వంటలో ఇవి తప్పనిసరి. వారి ఇండ్లల్లో పోయి వెలగాలంటే ఉల్లి ఉండా ల్సిందే. చౌకగా లభించే ఉల్లి ధర పెరిగిందంటే వారి కండ్లల్లో కన్నీరు చేరినట్టే. మన దేశంలో రోజుకు రూ. 100 కూడా ఖర్చు పెట్టలేని కుటుంబాలు కోట్లల్లో ఉన్నాయి. చాలీచాలని జీతాలతో అరకొరగా సంసారాన్ని లాగుకొస్తున్నవారు కోకొల్లలు. అటువంటి వారందరిపైనా ఉల్లి ధర పెను భారాన్ని మోపనున్నది. నిత్యజీవితాలను మరింత భారంగా మార్చనున్నది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసరాల ధరలు చుక్కలకెక్కుతున్న విషయం తెలిసిందే. పెట్రోల్, డీజిల్ ధరలు సహా కూరగాయలు, టమాటలు, వెల్లుల్లి, ఉల్లి ధరలు మంటమండిస్తున్నాయి.
నాసిక్లోని లాసల్గావ్లో ఉల్లి ధరలు గతవారం నుంచి క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా వంట ఇండ్లల్లో కాక పుట్టిస్తున్నది. నాసిక్లోని రిటేల్ మార్కెట్లో కిలో ఉల్లి ధర వారం కింద రూ. 35 ఉండగా నేడు రూ. 50ని తాకింది. ఇదిలా ఉండగా, ఒక్క గురువారం రోజునే క్వింటాల్ ఉల్లి ధరపై రూ. 1000 పెరగడంతో సాధారణ ప్రజలు సహా వ్యాపారుల్లోనూ గుబులు మొదలైంది. క్వింటాల్ ఉల్లిధర 2016 సెప్టెంబర్ 16న రూ. 4,300లకు పెరిగింది. అటు తర్వాత ఆగస్టు 22న ఆల్టైం రికార్డు స్థాయిలో క్వింటాల్ ధర రూ. 5,700లకు చేరింది. గతనెలలో రోజుకు సుమారు 15వేల క్వింటాళ్ల ఉల్లి లాసల్గావ్ మార్కెట్కు వస్తుండగా.. నేడు అది 10 నుంచి 12వేల క్వింటాళ్లకు పడిపోయింది. గురువా రంనాడు ఇది ఏడు వేల క్వింటాళ్లకు దిగజారింది. వర్ష బీభత్సం కారణంగా ఉల్లి స్టాక్ మార్కెట్ చేరలేదని కొందరు చెబుతుండగా.. ఈసారి దక్షిణాదిన ఉల్లి పంట సాగు తగ్గిందని మరికొందరు వివరిస్తున్నారు. దక్షిణాదిన ఉల్లి ఉత్పత్తి తగ్గడంతో డిమాండ్ పెరిగిందని తెలిసింది. రైతుల దగ్గరున్న ఉల్లి పంట మొత్తం మార్కెట్లోకి వచ్చిం దనీ, మళ్లీ ఖరీఫ్ కాలానికి సంబంధించిన ఉల్లిపంట వచ్చే వరకు మార్కెట్లో బీభత్స వాతావరణం ఉంటుందని ఉల్లి వ్యాపారి మనోజ్ జైన్ ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న 15 నుంచి 20 రోజుల వ్యవధిలో ఉల్లి కొత్త పంట మార్కెట్లోకి వచ్చే అవకాశమున్నదని సంబంధిత వర్గాలు తెలిపాయి.