Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి జవదేకర్ సమక్షంలో..
- ఢిల్లీ పార్టీ కార్యాలయంలో ఘటన
న్యూఢిల్లీ: బీజేపీ పార్టీ కార్యాలయంలోనే ఆ పార్టీ నాయకుడు తన భార్యపై చేయిచేసుకున్నాడు. ఈ ఘటననే దేశ రాజధానిలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్ కావడంతో ఆ నాయకుడు చిక్కుల్లో పడ్డాడు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో గురువారం కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్ అధ్యక్షతన బీజేపీ నాయకులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీలోని మెహరౌలీ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అజాద్ సింగ్ హాజరయ్యారు. అదే మీటింగ్కు ఆయన భార్య ఢిల్లీ మాజీమేయర్ సరితా చౌదరి సైతం వచ్చారు. అయితే వీరిరువు మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. విడాకుల కోసం ఇద్దరూ కోర్టును ఆశ్రయించారు. మీటింగ్లో ఆమె కనబడటంతో ఆగ్రహనికి గురైన అజాద్ సింగ్ తన భార్యపై చేెయ్యి చేసుకున్నాడు. ఆమెపై ఇష్టం వచ్చినట్టు దాడిచేసి, అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ దాడి సమయంలో కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ అక్కడే ఉన్నారు. ఇదంతా కొందరూ వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది. ఈ ఘటన పై స్పందించిన పార్టీ అధిష్టానం దక్షిణ ఢిల్లీ మెహరౌలీ జిల్లా అధ్యక్ష పదవి నుంచి అజాద్ సింగ్ను తప్పించి, ఆ పదవిలో వికాస్ తన్వార్ను నియమించినట్టు సమాచారం.