Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 25న తీర్పు
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో అరెస్టై ప్రస్తుతం తీహార్ జైళ్లో ఉన్న కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డి.కె. శివకుమార్ బెయిల్ పిటిషన్ను ఢిల్లీ కోర్టు రిజర్వులో పెట్టింది. బెయిల్కు సంబంధించిన తీర్పును ఈ నెల 25న వెలువరించనున్నట్టు వెల్లడించింది. మనీలాండరింగ్ కేసులో శివకుమార్ను ఈ నెల 3న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనను ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయస్థానం కస్టడీకి పంపించింది. దీన్ని సవాలు చేస్తూ.. శివకుమార్ తరఫు న్యాయవాదులు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శనివారం విచారణ చేపట్టిన కోర్టు.. పై విధంగా స్పందించింది. ఇదిలా ఉండగా.. శివకుమార్కు బెయిల్ మంజూరు చేస్తే.. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందని ఈడీ ఆరోపించింది. వీటిని శివకుమార్ తరఫు న్యాయవాదులు ఖండించారు.