Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎవరితోనూ పొత్తులుండవు : జేడీఎస్
బెంగళూరు:అసెంబ్లీ ఉప ఎన్నికలకు ఈసీ ప్రకటన వెలువడటంతో కర్నాటకలో ఎన్నికల వేడి మొదలైంది. మరోవైపు కాంగ్రెస్తో పొత్తుపై జేడీఎస్ కీలక ప్రకటన చేసింది. కర్నాటక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఏ ఒక్కరితోనూ పొత్తు పెట్టుకునేది లేదని జేడీఎస్ ప్రకటించింది. తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని జేడీఎస్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. జేడీఎస్ అభ్యర్థులు 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తారని, కుమారస్వామి ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని తెలిపింది. అయితే, జేడీఎస్ ప్రకటనపై కాంగ్రెస్ స్పందించలేదు. కర్నాటకలోని 15 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 21న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఈసీ శనివారం ప్రకటించింది.