Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ఘటన శనివారం మిరేచి పట్టణంలో చోటుచేసుకుంది. పేలుడు ధాటికి భవనం కుప్పకూలిపోయింది. శిధిలాల కిందపడి ఆరుగురు మరణించారు. పలువురికి గాయాలైనట్టు అధికారులు తెలిపారు. ఆగ్రాకు 100 కిలోమీటర్ల దూరంలోని ఏత్ జిల్లాలోని మిరేచి పట్టణంలోని టాకియా ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. అనుమతులు లేకుండా ఈ భవనంలో బాణాసంచా తయారు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. శిధిలమైన భవనం కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరణించిన వారిలో కొందరు చిన్నారులు కూడా ఉన్నారు.