Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డెహ్రాడూన్లో విషాదం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో కల్తీమద్యం సేవించి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన డెహ్రాడూన్ సమీపంలోని పఠారియా పీర్ బస్తీలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. పీర్బస్తీకి చెందిన కార్మికులు గురువారం రాత్రి కల్తీ మద్యం సేవించి, అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో ముగ్గురు మరణించారు. మరో ముగ్గురు చిక్సిత పొందుతూ శుక్రవారం మరణించారు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విచారణ చేస్తున్నట్టు తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మృతుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కల్తీమద్య వ్యాపారం బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి మద్దతుతోనే జరుగుతున్నదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకుడు సూర్య కాంత్ ధస్మాన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనతతోనే నగరంలో ఈ విషాదం చోటుచేసుకున్నదని విమర్శించారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ.. ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తన ఆధీనంలో ఉన్న ఎక్సైజ్ శాఖకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రావత్ విచారం వ్యక్తం చేశారు. దీనిపై మెజిస్టీరియల్ దర్యాప్తునకు ఆదేశించినట్టు తెలిపారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనలో అనారోగ్యానికి గురైనవారికి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా వైద్యులను ఆదేశించారు.