Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : నమ్మండి, నమ్మకపోండి ఒక మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) చింపాంజిలను, మారెమసెట్ (తోకకు కుచ్చులు కలిగిన దక్షిణ అమెరికాకు చెందిన కోతి) జప్తు చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. పశ్చిమ బెంగాల్కు చెందిన ఒక వన్యప్రాణి స్మగ్లర్పై నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఇడి ఆ జంతువులను జప్తు చేసింది. మనీ లాండరింగ్ చట్టం (పిఎంఎల్ఎ) కింద తొలిసారిగా ఈ చర్యకు పాల్పడినట్లు ఇడినే తెలిపింది. వాటిని తీసుకెళ్ళేందుకు స్మగ్లర్ ప్రయత్నాలు చేస్తున్నందున, కోల్కతాలోని జూ అధికారులు వాటిని కాపాడేందుకు చర్యలు తీసుకొనేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇడి తెలిపింది. కోల్కతాలోని అలిపోర్ జులాజికల్ గార్డెన్కు వచ్చే సందర్శకులను ఆ మూడు చింపాంజిలు బాగా ఆకర్షిస్తున్నాయి. మంచి ఆదాయాన్ని కూడా తెచ్చి పెడుతున్నాయి. తాము స్వాధీనం చేసుకున్న ఏడు జంతువుల విలువ రూ.81 లక్షలు ఉంటుందని ఇడి వర్గాలు తెలిపాయి. ఒక్కొక్క చింపాంజి రూ.25 లక్షలు, ఒక్కొక్క మారెమ్సెట్ రూ.1.5 లక్షలు ఉంటుందని వెల్లడించాయి. చట్ట విరుద్ధంగా వన్యప్రాణులను కలిగి ఉన్నాడని స్మగ్లర్ సుప్రదిప్ గుహపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇడి ఈ కేసు దర్యాప్తు చేసింది. వన్య ప్రాణులను అక్రమంతా తరలించేందుకు నకిలీ (ఫోర్జరి) అనుమతి పత్రాలను ఉపయోగించినందుకు సుప్రదిప్ గుహపై పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యవస్థీకృత వన్య ప్రాణి స్మగ్లింగ్ రాకెట్ను నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని ఇడి పేర్కొంది.