Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కొఠారి
చెన్నై : మద్రాసు హైకోర్టు చీఫ్ జస్టిస్(సీజే) వికె తహిల్రమణి రాజీనామాను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోదించారు. ఈ మేరకు ప్రభుత్వం ఒక నోటిఫికేషన్లో పేర్కొన్నది. ఈనెల 6నుంచి ఆమె రాజీనామా అమలులోకి రానున్నదని అందులో ప్రస్తావించింది. మేఘాలయ హైకోర్టుకు తనను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తహిల్రమణి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా, మద్రాసు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వి కొఠారీని నియమించినట్టు మరొక నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొన్నది.