Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు
- అక్టోబరు 21న పోలింగ్.. 24న ఫలితాలు
- హూజుర్నగర్తో పాటు దేశంలోని మరో 64 స్థానాలకు ఉప పోరు
- బీహార్లో సమస్థిపూర్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక
- ప్రచారంలో ప్లాస్టిక్కు దూరంగా ఉండాలి : ఈసీ
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు, దేశ వ్యాప్తంగా ఖాళీ అయిన శాసనసభ స్థానాలకు ఎన్నికల నగారా మోగింది. అక్టోబరు 21న రెండు రాష్ట్రాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇరు రాష్ట్రాల ఎన్నికలు, ఉప ఎన్నికల ప్రక్రియపై శనివారం ఢిల్లీలోని నిర్వాచన్ సదన్లో ఈసీ ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నవంబరు 2 హర్యానా అసెం బ్లీకి గడువు, మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబరు 9. ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఉత్తరాదిన చిన్న రాష్ట్రాల్లో ఒకటైన హర్యానా లోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు, మహారాష్ట్రలోని 288 స్థానాలకు ఎన్నికలు జరపనున్నట్టు చెప్పారు. ఇందుకు సంబంధించి ఈ నెల 27న నోటిఫికేషన్ విడుదల కానుందని వెల్లడించారు. అక్టో బరు 4తో నామినేషన్ల స్వీకరణకు గడువు ముగుస్తుంద న్నారు. అక్టోబరు 5న నామి నేషన్లను పరిశీలన, అక్టోబర్ 7 నామినేషన్ల ఉప సంహరణకు అఖరి గడువు విధించి నట్టు వివరించారు. అక్టోబరు 21న ఎన్నికలు నిర్వహించి, అక్టోబరు 24న ఫలితాలు వెల్లడిస్తామని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా చెప్పారు. అయితే, ఆ యా రాష్ట్రాల్లో నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.
హుజూర్నగర్ స్థానానికి కూడా..
హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలతోనే రాష్ట్రంలోని హుజూర్నగర్ అసెంబ్లీ స్థానా నికి సైతం ఎన్నికలు జరపనున్నట్టు సునీల్ అరోరా చెప్పారు. నల్లగొండ పార్లమెంట్ సభ్యులుగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించ డంతో హుజూర్ నగర్ ఎమ్మెల్యే స్థానానికి ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ స్థానంతో పాటూ, దేశవ్యాప్తంగా 63 అసెంబ్లీ స్థానాలకు, బిహార్ లోని సమస్థిపూర్ లోక్సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడిం చింది. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు, ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం వేరు వేరు తేదిల్లో నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. ఎన్నికలు మాత్రం అక్టోబర్ 21 నే జరగనున్నాయి. ఉప ఎన్నికలకు సంబంధించి సెప్టెంబరు 23న నోటిఫికేషన్ విడుదల కానుంది. సెప్టెంబరు 30 నామినేషన్ల స్వీకరణకు చివరి తేది కాగా, అక్టోబరు 1న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉప సంహరణకు అక్టోబరు 3 వరకు గడువు విధించారు. అక్టోబరు 24న ఫలితాలు వెల్లడించనున్నట్టు సునీల్ అరోరా తెలిపారు. వీటితోపాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సైతం ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. అందులో ప్రధానంగా... తెలంగాణలోని హుజూర్నగర్తో పాటు అరుణాచల్ప్రదేశ్లో 1, అసోంలో 4, బీహార్లో 5, ఛత్తీస్గఢ్లో 1, గుజరాత్లో 4, హిమాచల్ప్రదేశ్లో 2, కర్నాటకలో 15, కేరళలో 5, మధ్యప్రదేశ్లో 1, మేఘాలయలో 1, ఒడిశాలో 1, పుదుచ్చేరిలో 1, పంజాబ్లో 4, రాజస్థాన్లో 2, సిక్కింలో 3, తమిళనాడులో 2, ఉత్తరప్రదేశ్లో 11 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్టు అరోరా చెప్పారు.
ఈసారి ఎకో ఫ్రెండ్లీ ఎన్నికలు...
ఈ ఎన్నికల్లో ఎకో ఫ్రెండ్లీ పాలసీ పాటించనున్నట్టు సునీల్ చెప్పారు. ఎన్నికల్లో భద్రతాపరమైన చర్యలు ప్రత్యేకంగా చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఇందుకోసం కేంద్ర బలగాల సాయం తీసుకోనున్నట్టు చెప్పారు. అన్ని సెక్యూరిటీ పోస్టుల్లో వెబ్కా స్టింగ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. ఎకో ఫ్రెండ్లీ కోసం రాజకీయ నేతలు తమ ప్రచారంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని ఆయన కోరారు. మహిళల కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు అరోరా తెలిపారు. అంధుల కోసం ప్రత్యేకంగా బ్రెయిలీ లిపిలో ఓటర్ స్లిప్ అందిస్తా మన్నారు. హర్యానాలో వంద శాతం ఎపిక్ కార్డులు పంపిణీ కాగా, మహారాష్ట్రంలో 96.81 శాతం అందించినట్టు చెప్పారు. మిగతా స్థానాల్లో త్వరలో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.