Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉప ఎన్నికలు: ఈసీ ప్రకటన
గాంధీనగర్: గుజరాత్లోని మరో రెండు శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలను నిర్వహించబోతున్నట్టు ఎలక్షన్ కమిషన్ (ఈసీ) ఆదివారం ప్రకటించింది. రాష్ట్రంలోని ఏడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించనుండగా నాలుగు (అమ్రావాడి, తారద్, లునావాడ, ఖేరలు) స్థానాల షెడ్యూల్ను ఈసీ శనివారమే విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాధన్పూర్, బయాద్ అసెంబ్లీ స్థానాల షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ రెండు స్థానాల్లో ఇంతకుముందు కాంగ్రెస్కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు అల్పేష్ ఠాకూర్, ధవల్సింగ్ జాలాలు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో ఈ స్థానాలకు ఉప ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి. పై ఆరు స్థానాలకు వచ్చేనెల 21న ఉప ఎన్నికలు జరగనున్నాయి. కాగా, గిరిజనులకు కేటాయించిన మోర్వా హడాఫ్ స్థానానికి షెడ్యూల్ను ప్రకటించాల్సి ఉంది.