Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టికల్ 370 రద్దు అనరతరం పరిస్థితులపై ఆరా
శ్రీనగర్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కాశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ శ్రీనగర్ను పర్యటించారు. సుప్రీంకోర్టు ప్రత్యేక అనుమతితో జమ్మూకాశ్మీర్లో నాలుగురోజుల పర్యటన ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా రెండోరోజు శ్రీనగర్లోని లాల్ దేడ్ ఆస్పత్రిలోని రోగులను పరామర్శించారు. వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానికులను కలుసుకొని ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఉన్న పరిస్థితులపై ఆరా తీశారు. ఈ క్రమంలోనే కాశ్మీర్ బోట్హౌస్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులతో సంభాషించారు. జమ్మూకాశ్మీర్ను సందర్శించడానికి గులాం నబీ ఆజాద్ గతంలో మూడు సార్లు ప్రయత్నించినప్పటికీ.. కేంద్రప్రభుత్వం అనుమతించలేదు. చివరిగా సోమవారం భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్గొగోరు నేతృత్వంలోని ధర్మాసనం.. శ్రీనగర్, జమ్మూ, బారాముల్లా , అనంతనాగ్ జిల్లాలను మాత్రమే పర్యటించాలని అనుమతించిన విషయం తెలిసిందే.