Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ జితేంద్రకుమార్ మహేశ్వరితో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, పలువురు మంత్రులు ,హైకోర్టు న్యాయవాధులు, ఉన్నతాధికారులు, పాల్గొన్నారు. సంప్రదాయంగా చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారోత్సవం రాజ్భవన్లో జరగడం ఆనవాయితీ. ఇందుకు భిన్నంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజ్భవన్ ఇరుకగా ఉండటమే దీనికి కారణమని సమాచారం. సమైక్య రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నియమితులైన మొట్టమొదటి పూర్తిస్థాయ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరీ కావడం గమనార్హం. మధ్యప్రదేశ్ హైకోర్టున్యాయ మూర్తిగా సేవలందిస్తున్న ఆయనను ఏపీ హైకోర్టు సీజేగా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది.