Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12 మంది మృతి, 16 మందికి గాయలు
లక్నో: ఉత్తర్ప్రదేశ్లో విషాదం చోటుచేసుకుంది. మౌ జిల్లా మొహ్మదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి రెండంతస్తుల భవనం కుప్పకూలింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పేలుడు సమయంలో భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులకు అన్ని విధాలా అండగా నిలుస్తామని హమీ ఇచ్చారు. సహాయకచర్యలను వేగవంతం చేయాలనీ, శిథిలాల కింద చిక్కుకున్న వారిని వీలైనంత త్వరగా బయటకు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.