Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి అంధ మహిళా ఐఏఎస్
తిరువనంతపురం : దేశంలోనే తొలి అంధ మహిళా ఐఏఎస్ ప్రాంజల్ పాటిల్ (31)తిరువనంతపురం సబ్ కలెక్టర్గా సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రాంజల్ పాటిల్ మహారాష్ట్రలోని ఉల్హస్నగర్కు చెందిన వారు. ఆమె తన ఆరేండ్ల వయస్సులోనే కంటి చూపు కోల్పోయారు. ఐఏఎస్ కావాలన్న ఆమె లక్ష్యానికి అంధత్వం ఏ మాత్రం అడ్డంకి కాలేదు. అనేక అవరోధాలను దాటుకుని సివిల్ సర్వీసులకు ఎంపికైన తొలి అంధ మహిళగా నిలిచారు. తిరువనంతపురం జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ కె. గోపాలకృష్టన్, ఇతర సిబ్బంది సమక్షంలో ఆమె బాధ్యతుల స్వీకరించారు. ఈ సందర్భంగా పాటిల్ మాట్లాడుతూ ''మనం ఎప్పుడూ ఓడి పోకూడదు. వదులుకోకూడదు'' అన్నారు. తిరువనంతపురంలో బాధ్యతలు స్వీకరించడం తనకు చాలా గర్వంగా ఉందన్నారు. ప్రజల నుంచి, కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది నుంచి తనకు మద్దతు లభిస్తుందని భావిస్తున్నట్టు ఆమె తెలిపారు. 2017 సివిల్ సర్వీస్ పరీక్షలలో ఆమె 124వ ర్యాంకు సాధించారు. అనంతరం 2018లో కేరళలోని ఎర్నాకుళం అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేశారు.