Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరవధిక సమ్మెలో 20 వేల మంది
- యాజమాన్యంతో జరిగిన చర్చలు విఫలం
- పదిహేను రోజుల కిందటే నోటీసులు
న్యూఢిల్లీ : యాజమాన్యంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. వేతనాల్లో వివక్ష, ఇంక్రిమెంట్లలో కోతను నిరసిస్తూ సుమారు 20 వేల మంది ఉద్యోగులు సోమవారం నుంచి నిరవధిక సమ్మె కు దిగారు. ఆలిండియా హాల్ ట్రేడ్ యూనియన్ కో ఆర్డినేషన్ కమిటీ (ఏఐహెచ్ఏఎల్టీయూ సీసీ) ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన కార్యక్ర మాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వరంగ సంస్థ అయిన హెచ్ఏఎల్కు దేశంలోని ఏడు రాష్ట్రాల్లో కార్యాలయాలున్నాయి. ఈప్రాంతాల్లోని దాదాపు అన్ని కార్యాలయాల్లోని ఉద్యోగులు యాజమా న్యం తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. దీనిపై కార్మిక సంఘాల సమాఖ్య నాయకుడు సూర్యదేవర చంద్రశేఖర్ మాట్లాడుతూ.. వేత నాల్లో ఎగ్జిక్యూటివ్స్కు, ఇతర ఉద్యోగులకు వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. ఉద్యోగులకు 19 శాతం ఫిట్మెంట్ ఇవ్వగా.. ఎగ్జిక్యూటివ్స్కు మాత్రం ఏకంగా 35శాతం ఇస్తున్నారని
చెప్పారు. అంతేగాక రెండేండ్లు గడుస్తున్నా తమకు వేతన బోర్డును పునరుద్ధరించడం లేదని అన్నారు. దీనిపై ఇప్పటిదాకా పదకొండుసార్లు చర్చలు జరిపినా యాజమాన్యం మాత్రం సరైన విధంగా స్పందించలేదని విమర్శించారు. సంస్థ నష్టాల భారాలను ఉద్యోగులపై మోపడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక చట్టాల ననుసరించి పదిహేను రోజుల క్రితమే తాము సమ్మె నోటీసులు ఇచ్చా మనీ, అయినా యాజమాన్యం మాత్రం ఉద్యోగుల సమస్యలు పరిష్కరిం చడంలో చొరవ చూపలేదని చంద్రశేఖర్ ఆరోపించారు. చర్చలకు దేశవ్యాప్తంగా ఉన్న తమ సంఘాల నాయకులు హాజరుకాలేకపోయినా.. వారంతా సమ్మెలో పాల్గొంటారని ఆయన తెలిపారు.