Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆర్థిక మందగమన వాస్తవాన్ని అంగీకరించే స్థితిలో ప్రభుత్వం లేదని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ భర్త, పొలిటికల్ ఎకనామిస్ట్ పరకాల ప్రభాకర్ విమర్శించారు. దేశంలో పెరుగుతున్న ఆర్థిక మాంద్యం తీరుపట్ల ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. నాడు పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ అనుసరించిన ఆర్ధిక విధానాలే భేష్ అని అభిప్రాయపడ్డారు. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న పరకాల ప్రభాకర్ పీవీ, మన్మోహన్ పాటించిన ఆర్ధిక విధానాలు నేటికీ ఆదర్శంగా, ఉద్దీపనతో కూడినవిగా ఉన్నాయని 'హిందూ' డైలీకి రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఆర్ధిక వ్యవస్థ బాగాలేదన్న వాస్తవాలను అంగీకరించడానికి సిధ్దంగా లేదని విమర్శించారు. నాటి ఆ ఇద్దరు ప్రధానులూ పాటించిన విధానం ఆర్ధిక సరళీకరణకు మార్గాన్ని సుగమం చేసిందని పేర్కొన్నారు. నెహ్రు హయాంలోని సోషలిజాన్ని విమర్శించే బదులు.. ఆ పాలసీలను ప్రస్తుత ప్రభుత్వం పాటించడం మంచిదని సూచించారు. ఒకదాని తరువాత ఒకటిగా వివిధ రంగాలు పడిపోతున్న తీరు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నదని తెలిపారు. బీజేపీలోని మేధావి వర్గం ఎదురుదాడి చేస్తూ కాలయాపన చేస్తున్నారనీ... విమర్శలు చేసినంతమాత్రాన అవి ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి దారితీస్తాయా అని ఆయన ప్రశ్నించారు.