Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముందు విచారణ.. అవసరమైతే అదుపులోకి : ట్రయల్ కోర్టు
న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని అదుపులోకి తీసుకునేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ)కు ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం అనుమతినిచ్చింది. అయితే, ఈ కేసులో ముందుగా ఆయనను విచారించి.. ఆ తర్వాత అవసరమైతే అరెస్టు చేయాలని కోర్టు సూచించింది. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న చిదంబరం కస్టడీ ఈనెల 17తో ముగుస్తుండగా.. ఇదే కేసులో విచారించేందుకు ఆయనను తమకు అప్పగించాలని సీబీఐ ప్రత్యేక కోర్టును ఈడీ అభ్యర్థించింది. చిదంబరాన్ని కోర్టు పర్యవేక్షణలోనే విచారిస్తామని ఈడీ తెలుపగా.. దానికి కోర్టు అంగీకరించలేదు. ఇది చిదంబరం గౌరవానికి సంబంధించిన అంశమనీ, తీహార్ జైల్లోనే విచారణ జరిపి.. తర్వాత అవసరమైతే ఆయనను అదుపులోకి తీసుకోవాలని కోర్టు సూచించింది. పలు నాటకీయ పరిణామాల మధ్య చిదంబరాన్ని గతనెల 5న తీహార్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. కాగా, బెయిల్ కోరుతూ చిదంబరం దాఖలు చేసుకున్న పిటిషన్పై సుప్రీంకోర్టులో పిటిషన్దారుడి వాదనలు మంగళవారం ముగియగా.. సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా నేడు కోర్టులో వాదనలు వినిపించనున్నారు.