Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కర్నాటక కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్ జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించింది. శివకుమార్ను మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్ (ఈడీ) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, మంగళవారంతో ఆయన జ్యుడిషయల్ కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు కోర్టు ముందు హాజరు పర్చారు. బయటకు వస్తే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నద ని ఈడీ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం శివకుమార్ బెయిల్ పిటిష న్ను తిరస్కరించింది. ఈడీ విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణ నిమిత్తం ఆయనను కోర్టు కస్టడీకి అప్పగించింది. కాగా, ఆయనపై ఉన్న మనీలాం డరింగ్ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని కోరుతూ ఆయన తల్లి, భార్యకు ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.